/rtv/media/media_files/2025/03/02/cs8PS8zb1jh6qot8aaex.jpg)
ind vs nz live score Photograph: (ind vs nz live score)
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో భారత్ తడబడినట్లు తెలుస్తోంది. స్టార్ బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. ఒక్క శ్రేయస్ మాత్రమే హాఫ్ సెంచరీ సాధించాడు. శ్రేయస్ అయ్యర్ (79; 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్లో హార్ధిక్ పాండ్యా, జడేజా ఉన్నారు. తాజాగా భారత్ 200 పరుగులను చేసింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ కాస్త హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !
ఇప్పటి వరకు 200 దాటుతుందా? అనే డౌట్ అందరిలోనూ ఉండేది కానీ ఆ టార్గెట్ సాధించడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ మ్యాచ్లో మొదట తడబడిన భారత్ మెల్లి మెల్లిగా కోల్కొంది. మొదట 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. శుభమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా ఔటయ్యారు. తర్వాత క్రీజ్లో ఉన్న శ్రేయస్, అక్షర్ పటేల్ నిలకడగా ఆడి పరుగులు రాబట్టారు. 25 ఓవర్లు పూర్తి అయ్యే సరికి భారత్ 104 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్
భారత్ vs న్యూజిలాండ్తో రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ క్రీజ్ లోకి దిగారు. రెండు ఓవర్లు నిలకడగా ఆడారు. కానీ శుభమన్ గిల్ ఎల్బీడబ్లూతో ఔటయ్యాడు. దీంతో చాలా తక్కువ సమయంలోనే అతడు పెవిలియన్కు చేరాడు.
ఇది కూడా చూడండి: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!
కాగా శుభమన్ గిల్ తక్కువ సమయంలోనే ఔటవ్వడంతో టీమిండియా ఫ్యాన్స్ నిరాశ చెందారు. మొదటి రెండు మ్యాచ్ల్లో దుమ్ము దులిపేసిన అతడు ఈ మ్యాచ్లో తక్కువ సమయంలోనే ఔటయ్యాడు. దీంతో అతడి ఆట చూసేందుకు వచ్చిన అభిమానులు లబోదిబోమంటున్నారు. అదే సమయంలో రోహిత్ శర్మ సైతం పెవిలియన్కు చేరాడు. పాయింట్లో క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇది కూడా చూడండి: USAID: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్జెండర్లు.. భారత్లోనూ మూతపడ్డ ఆ క్లినిక్లు!
ఓపెనర్లుగా దిగిన ఇద్దరు స్టార్ బ్యాటర్లు పెవిలియన్కు చేరడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందారు. ఫోర్లు, సిక్సర్లతో అదగొడతారనుకున్న ప్లేయర్లు తక్కువ సమయంలోనే ఔట్ కావడంతో కంగారు పడ్డారు. ప్రస్తుతం క్రీజ్లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతున్నారు అని అంతా అనుకునే లోపే కోహ్లీ ఔటయ్యాడు. క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
ఇది కూడా చూడండి: IAS అధికారికి వంగా మాస్ కౌంటర్ .. అది అనవసరమంటూ..
కెరీర్లో 300వ వన్డే ఆడిన విరాట్ కోహ్లీ స్వల్ప స్కోరుకే ఔట్ అయ్యాడు. వేగంగా ఆడే క్రమంలో విరాట్ (11) పెవిలియన్కు చేరాడు. ఫిలిప్స్ అందుకున్న క్యాచ్ విన్యాసానికి కోహ్లీ స్టన్ అయిపోయాడు. దీంతో స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. చూడాలి భారత్ స్కోర్ ఎంత చేస్తుందో.