IND Vs AUS 2nd ODI: టీమిండియాకు బిగ్ షాక్.. రోహిత్ శర్మ సహా ముగ్గురు ప్లేయర్స్ ఔట్

భారత్ vs ఆస్ట్రేలియా రెండవ వన్డే కోసం టీమ్ ఇండియాలో మార్పులు ఉండవచ్చు. మొదటి వన్డేలో విఫలమైన రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలలో ఇద్దరు లేదా ముగ్గురిని తప్పించి కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

New Update
IND Vs AUS 2nd ODI team india changes playing 11 for second odi match ind vs aus

IND Vs AUS 2nd ODI team india changes playing 11 for second odi match ind vs aus

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండవ మ్యాచ్ అక్టోబర్ 23న జరగనుంది. అక్టోబర్ 19న జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైన నేపథ్యంలో, రెండవ వన్డే కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లను తప్పించి, వారి స్థానంలో కొత్తవారిని తీసుకునే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. 

సెకండ్ మ్యాచ్ కు రోహిత్ ఔట్

ఈ జాబితాలో భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ పేరు ప్రముఖంగా ఉంది. మొదటి వన్డేలో రోహిత్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. అతని పేలవ ప్రదర్శన కారణంగా, రెండవ వన్డేలో రోహిత్ స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరోవైపు, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా మొదటి మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో అతని స్థానంలో కీలకమైన వికెట్ టేకింగ్ స్పిన్నర్ కులదీప్ యాదవ్కు అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అడిలైడ్ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నందున, కులదీప్ రాక జట్టు బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయనుంది. బౌలింగ్ విభాగంలో, యువ పేసర్ హర్షిత్ రాణాను కూడా తప్పించే అవకాశం ఉంది.

మొదటి మ్యాచ్‌లో అతని ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. అతని స్థానంలో, పొడవైన ఫాస్ట్ బౌలర్ అయిన ప్రసిద్ధ్ కృష్ణను ప్లేయింగ్ 11లోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ అదనపు బౌన్స్‌ను రాబట్టగలడు. ఇది ఆస్ట్రేలియా పిచ్‌లపై ప్రభావం చూపగలదు. అయితే విరాట్ కోహ్లి (మొదటి వన్డేలో డకౌట్ అయ్యాడు), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వంటి ప్రధాన బ్యాట్స్‌మెన్‌లు రెండవ వన్డేలో మెరుగైన ప్రదర్శన చేసి జట్టును విజయపథంలో నడిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అడిలైడ్ వేదికగా జరిగే ఈ రెండవ వన్డే భారత్‌కు సిరీస్‌ను సమం చేయడానికి చాలా కీలకం కానుంది. జట్టులో మార్పులు చేసి బలమైన వ్యూహంతో బరిలోకి దిగితేనే విజయం సాధ్యమవుతుంది. 

భారత జట్టు ప్లేయింగ్ 11 

యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

Advertisment
తాజా కథనాలు