BCCI: ఆసియాకప్ ట్రోఫీ కోసం BCCI బిగ్ ప్లాన్.. దుబాయ్ నుంచి నేరుగా ఇండియాకు!

ఆసియాకప్ ట్రోఫీని ఇండియాకు తెప్పించేందుకు BCCI ప్రణాళికను రూపొందిస్తోంది. ACC చీఫ్ మొహ్సిన్ నఖ్వీ షరతుకు అంగీకరించకుండానే ట్రోఫీని భారత్‌కు అప్పగించేలా ICCకి లేఖ రాసినట్లు తెలుస్తోంది.

New Update
bccii

BCCI: ఆసియాకప్ ట్రోఫీని ఇండియాకు తెప్పించేందుకు BCCI ప్రణాళికను రూపొందిస్తోంది. ACC చీఫ్ మొహ్సిన్ నఖ్వీ షరతుకు అంగీకరించకుండానే ట్రోఫీని భారత్‌కు అప్పగించేలా ICCకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్‌లో గెలిచిన టీమ్ ఇండియా పాక్ మంత్రి చేతులమీదుగా ట్రోఫీ అందుకునేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ అయిన నఖ్వీ.. ట్రోఫీతోపాటు విజేతల పతకాలను దుబాయ్ స్టేడియంలోని తన హోటల్ గదికి తీసుకెళ్లాడు. దీంతో భారత జట్టు ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకుంది. 

దుబాయ్ నుంచి నేరుగా ఇండియాకు..

అయితే ఆసియా కప్ ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్‌లోని నఖ్వీ బస చేసిన హోటల్‌లోనే ఉండగా ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించడానికి ACCతో అనుబంధంగా ఉన్న మరికొన్ని క్రికెట్ సంఘాలను బీసీసీఐ సంప్రదిస్తోంది. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో ఉన్న ACC కార్యాలయానికి ట్రోఫీని అందజేయాలని, అక్కడి నుండి భారతదేశానికి పంపాలని నఖ్వీని బీసీసీఐ పెద్దలు కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ట్రోఫీని తన హోటల్‌కు తీసుకెళ్లిన నఖ్వీ చర్య ఆమోదయోగ్యం కాదని BCCI అభివర్ణించింది.

ఇది కూడా చదవండి: బాదం ఆరోగ్యకరమే కానీ.. వాటితో తింటేనే ప్రమాదం!!

నఖ్వీని తొలగించండి..

ఇక నవంబర్‌లో జరిగే ICC AGMలో ACC చైర్‌పర్సన్ పదవి నుండి నఖ్వీని తొలగించాలని ఐసీసీ బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. నఖ్వీని తొలగించడానికి BCCI ఒక ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. నవంబర్‌లో జరిగే ICC సమావేశంలో మేము ఈ అంశాన్ని తీవ్రంగా లేవనెత్తుతాం. అలాంటి వ్యక్తికి అంతర్జాతీయ క్రికెట్‌లోని అత్యున్నత సంస్థలలో స్థానం కల్పించకూడదు అని BCCI వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: పొద్దున్నే ఇలా చేయండి.. మొటిమలు.. మచ్చలను తగ్గించుకోండి

మరోవైపు మొహ్సిన్ నఖ్వీ భారతదేశానికి ట్రోఫీని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ అలా చేయడానికి గట్టి షరతు విధించాడు. నఖ్వీ భారత జట్టుకు ట్రోఫీని అందజేయడానికి అనుమతించే వేడుకను నిర్వాహకులు ఏర్పాటు చేయాలని పిసిబి చైర్మన్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ, క్రికెట్ సంబంధాలను పరిగణనలోకి తీసుకుంటే అలాంటి షరతుకు బీసీసీ అంగీకరించే అవకాశం లేదు.

41 ఏళ్ల ఆసియా కప్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఫైనల్ లో తలపడ్డ ఇరుజట్లలో టీమ్ ఇండియా నే పైచేయి సాధించింది. ఫైనల్ లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 69 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ను దగ్గరుండి గెలిపించాడు.  మరుపురాని విజయాన్ని సాధించిన తర్వాత భారత్ జట్టు మాత్రం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన తొమ్మిదో ఆసియా కప్ టైటిల్ ను తీసుకోవడానికి నిరాకరించింది. పాక్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తుండడమే దీనికి కారణం. వాళ్ళకు షేక్ ఇవ్వడానికే తాము ఒప్పుకోలేదని దీనికి ఎలా ఒప్పుకుంటామంటూ ట్రోఫీ , మెడల్స్ తీసుకోకుండానే టీమ్ ఇండియా ఆటగాళ్ళు డగౌట్ కు చేరుకున్నారు. 

Advertisment
తాజా కథనాలు