/rtv/media/media_files/2025/06/15/TxN8sXLtUWdAQs3eZNo5.jpg)
SA captain Bavuma
ఆస్ట్రేలియా క్రికెటర్ల నోటికి ఎంత బలుపో అందరికీ తెలిసిందే. స్లెడ్జింగ్ అనేది వారి ఆటలో ఒక భాగం. ఎదుటి వారిని దెబ్బ కొట్టేందుకు ఆయుధంగా వాడుకుంటారు. ఇప్పుడు కూడా అదే చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి సౌత్ ఆఫ్రికా విజేతగా నిలిచింది. 27 ేళ్ళ తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుని చోకర్స్ అనే ముద్రను తుడిచేసుకుంది. మంచి క్రికెట్ ఆడి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు ప్రోటీస్ క్రికెటర్లు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో ఆసీస్ తమపై ఓ దశలో స్లెడ్జింగ్కు దిగినట్లు దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవూమా ఆరోపించాడు. తమ జట్టు విజయం సాధిస్తుందని తెలిసాక.. ఆసీస్ ఆటగాళ్లు తమ నోటికి పనిచెప్పారని తెలిపాడు.
స్లెడ్జింగ్ కింగ్స్..
ఫైనల్స్ మ్యాచ్ లో మూడో రోజుకే విజయం సౌత్ ఆఫ్రికాదేనని తెలిసిపోయింది. టైమ్ అయిపోవడంతో ఇంకా 69 పరుగులు చేయాల్సి ఉండగా ఆటను నిలిపేశారు. కానీ అప్పటికి ప్రోటీస్ టీమ్ మంచి పటిష్టమైన స్థితిలో ఉంది. మార్కర్రమ్, బవుమాలు దంచికొడుతున్నారు. అదీకాక ఇంకా ఎనిమిది వికెట్లు వారి చేతిలో ఉన్నాయి. ఈ స్థితిలో నాలుగో రోజు బ్యాటింగ్ కు దిగింది సౌత్ ఆఫ్రికా టీమ్. అయితే అప్పటికే తాము ఓడిపోతామని ఆస్ట్రేలియా వాళ్ళకు తెలిసిపోయింది. దీంతో వాళ్ళు ప్రోటీస్ ఆటగాళ్ళను దెబ్బతీసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. చివరి ప్రయత్నంగా స్లెడ్జింగ్కు కూడా దిగారు. తాను బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్ల నుంచి ‘చోకర్స్’ అనే పదాలు వినిపించాయని బవుమా తెలిపాడు. పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆసీస్లో చాలా మార్పులు వచ్చినప్పటికీ.. WTC Finalలాంటి ప్రతిష్ఠాత్మక పోరులో మళ్లీ ఇలా స్లెడ్జింగ్కు దిగడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.