Telangana: హైదరబాద్లో మళ్లీ డ్రగ్స్.. నడిరోడ్డుపై పట్టుకున్న పోలీసులు హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. అక్రమంగా హెరాయిన్ను రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను SOT పోలీసులు నడిరోడ్డుపై పట్టుకున్నారు. నిందితుల నుంచి 34 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. By B Aravind 20 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. అక్రమంగా హెరాయిన్ను రవాణా చేస్తున్న నిందితులను SOT పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 34 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. నిందితులు రమేష్ కుమార్ మరియు మహదేవ్ తోబుట్టువులు. 2022లో జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. అయితే వాళ్లుండే గదిలో రూమ్మేట్ విక్రమ్ గోయెల్తో కలిసి ఇద్దరూ హెరాయిన్కు బానిసలయ్యారు. అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు రాజస్థాన్లో తక్కువ ధరకు హెరాయిన్ కొనుగోలు చేసి హైదరాబాద్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. Also Read: క్లాస్ రూమ్లో కూలిన గోడ.. ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడ్డ విద్యార్థులు.. గత ఏడాది నుంచి దినేష్ కళ్యాణ్ అనే వ్యక్తి నుంచి వీళ్లు హెరాయిన్ కొనుగోలు చేస్తున్నారు. రాజస్థాన్లో ఒక గ్రాము హెరాయిన్ రూ.6 వేలు ఉండగా.. హైదరాబాద్లో ఒక గ్రాముకు రూ.12000 విక్రయిస్తున్నారు. ఇటీవలే రాజస్థాన్ వెళ్లి హైదరాబాద్కు తీసుకొచ్చిన దినేష్ కళ్యాణ్ నుంచి 30 గ్రాముల హెరాయిన్ కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం SOT ఎల్బీనగర్ బృందం సరూర్నగర్ పోలీసులతో కలిసి నిందితులను పట్టుకున్నారు. వారినుంచి 34 గ్రాముల హెరాయిన్, ఒక బైకు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారణ చేస్తున్నారు. Also Read: మస్తున్నావ్..నేను చెప్పిన ప్లేస్ కి రావాలి! Your browser does not support the video tag. #telugu-news #drugs #police #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి