CRIME : 25 ఏళ్లకే నలుగురిని పెళ్లాడిన యువతి.. చివరికి అందరూ కలిసి ఏం చేశారంటే

స్నేహా అనే యువతి 25 ఏళ్లకే నలుగురిని పెళ్లాడిన సంఘటన కర్ణాటకలో జరిగింది. డబ్బులున్న కుర్రాళ్లే టార్గెట్ గా పరిచయాలు పెంచుకుని వరుస పెళ్లిల్లు చేసుకుంది. ప్రెగ్నెంట్ పేరుతో పుట్టింటికి వెళ్లి ఆమె తిరిగి రాకపోవడంతో చివరి భర్త ప్రశాంత్ పోలుసులకు పట్టించాడు.

New Update
CRIME : 25 ఏళ్లకే నలుగురిని పెళ్లాడిన యువతి.. చివరికి అందరూ కలిసి ఏం చేశారంటే

Sneha Married 4 Men by Cheating : అతి తక్కువ సమయంలోనే కోట్ల ఆస్తి సంపాదించి జీవితాన్ని సుఖంగా గడపాలనే ఆశతో ఓ యువతి దారుణానికి పాల్పడింది. ఆడతనం, అందాన్ని అడ్డుగా పెట్టుకుని డబ్బున్న యువకులే టార్గెట్ గా వరుస పెళ్లిల్లు చేసుకుంటూ జల్సాలకు అలవాటైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 25 ఏళ్లకే నలుగురిని పెళ్లాడిన యువతి.. గర్భం(Pregnancy) పేరుతో పుట్టింటికెళ్తున్నట్లు చెబుతూ అందరినీ బురిడీ కొట్టించింది. అయితే చివరివాడు అసలు గుట్టు బయటపెట్టడంతో చివరికి ఆమె కటకటాలపాలైన సంఘటన కర్ణాటక(Karnataka) లో  చోటుచేసుకుంది.

ఈ మేరకు కర్ణాటకలోని మండ్య జిల్లా(Mandya District) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండ్య జిల్లా పాండవపురంకు చెందిన స్నేహ(  (25) అనే యువతి రెండేళ్ల కిందట రైల్లో ప్రశాంత్‌ అనే యువకుడిని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంది. అతనితో కొంతకాలం దావణగెరెలో అద్దె ఇంట్లో కాపురం పెట్టింది. అయితే కొన్నాళ్లకు ప్రెగ్నెంట్ అయిందని చెప్పి పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో రెండు నెలలు గడిచన తర్వాత ప్రశాంత్ ఆమెకు ఫోన్‌ చేసి రమ్మని అడిగితే సాకులు చెబుతూ కాలం గడిపింది. దీంతో ఆమె గతంలో చెప్పిన అడ్రస్ కు ప్రశాంత్ వెళ్లి చూడగా అక్కడ లేదు. దీంతో భార్య కనిపించడం లేదని కేటీజే నగర ఠాణాలో ఆయన ఫిర్యాదు ఇచ్చారు. దర్యాప్తులో పోలీసులకు మరో కొత్త విషయం తెలిసింది. స్నేహ ఇప్పటికే రెండు పెళ్లిల్లు చేసుకుందని, మొదట పెద్దలు మేలుకోటె నివాసి మహేశ్‌తో వివాహం జరిపించగా.. కొన్నాళ్లకు అతన్ని విడిచి పెట్టి బెంగళూరుకు చెందిన వెంకటేశ్‌ను రెండో పెళ్లి చేసుకుందని, ప్రశాంత్‌ మూడో భర్తగా గుర్తించారు.

ఇది కూడా చదవండి : Kurchi Thata : మహేష్ బాబుతో నా డాన్స్ చూస్తే.. కుర్చీలు మడత పెట్టాల్సిందే..!

దీంతో ఆమె అచూకీ కోసం పోలీసులు గాలిస్తుండగా మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇంతలోనే ఆమె బెంగళూరుకు చెందిన రఘు అనే యువకుడిని మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిపారు. ఇక అసలు విషయం తెలిసిన ప్రశాంత్‌ వెంటనే ఫిర్యాదు చేయగా స్నేహను అరెస్టు చేశామని, యువకుల నుంచి డబ్బుగుంజేందుకు స్నేహా ఇలాంటి పనులకు పాల్పడిందని చెప్పారు. ఇంకెవరైనా ఆమె బాధితులు ఉన్నారా? అనే కోణంలో కేసును విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు