Hyderabad : సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. స్వల్ప గాయాలు

తెలుగు సింగర్ మంగ్లీకి పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. దీంట్లో మంగ్లీకి స్వల్పంగా గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.

New Update
Hyderabad : సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. స్వల్ప గాయాలు

Singer Mangli Accident : ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు(Accidents) చాలా భయపెడుతున్నాయి. బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే లాస్య నందిత(MLA Lasya Nanditha) మరణం అందరినీ ఆందోళనకు గురి చేసింది. అది మరవక ముందే ఇప్పుడు మరో యాక్సిడెంట్ జరిగింది. తెలుగు సింగర్ మంగ్లీ(Singer Mangli) కారుకు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం తొండుపల్లి దగ్గరలో శనివారం అర్ధరాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారు(Car Accident) ను ఓ డీసీఎం వాహనం గుద్దింది. అయితే ప్రమాదం పెద్దగా జరగలేదు. మంగ్లీతో కారులో ఉన్న మరో ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

అసలేం జరిగిందంటే...
శంషాబాద్ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా(Rangareddy District) కన్హా శాంతివనంలో ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవానికి మంగ్లీ హాజరయ్యారు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం జరిగింది. ఉత్సవం అయ్యాక ఆమె మరో ఇద్దరు మేఘ్‌రాజ్‌, మరోహర్‌తో కలిసి ఆమె హైదరాబాద్(Hyderabad) రిటర్న్ అయ్యారు. ముగ్గురూ కారులో హైదరాబాద్-బెంగళూరు హైవే మీదుగా నగరానికి వస్తున్నారు. శంషాబాద్ మండలం తొండుపల్లె బ్రిడ్జ్‌ దగ్గరకు రాగానే మంగ్లీ ప్రయాణిస్తున్న కారును కర్ణాటకకు చెందిన డీసీఎం వాహనం గట్టిగా ఢీకొట్టింది. దీంతో కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బ తింది. అయితే కారులో ఉన్నవారు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. మంగ్లీతో సహా మరో ఇద్దరికీ స్వల్పగాయాలయ్యాయి. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడిపాడని పోలీసులు చెబుతున్నారు. దీని మీద కేసు నమోదు చేసి డ్రూఐదర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read : Telanagna: ప్రారంభం అయిన పదోతరగతి ఎగ్జామ్స్..విద్యార్ధులకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్

Advertisment
తాజా కథనాలు