Amarnath Yatra: అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన భారీ కుట్రను భద్రతాదబలగాలు భగ్నం చేశాయి. జమ్మూలోని నగ్రోటాలోని హైవేపై సోమవారం రాత్రి 12.30 గంటలకు భద్రతా బలగాలు ఐఈడీని స్వాధీనం చేసుకున్నాయి. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఐఈడీని కనిపెట్టడంలో మరో మూడు గంటలు ఆలస్యం జరిగి ఉంటే జమ్మూలో పెను ఉగ్రవాద ఘటన జరిగి ఉండేది. అదే సమయంలో, IED (improvised explosive device) రికవరీ తర్వాత, మొత్తం హైవేపై ఇంటెన్సివ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
పూర్తిగా చదవండి..Amarnath Yatra : అమర్నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర..హైవేపే ఐఈడీ స్వాధీనం..!!
జూలై 1 నుంచి జరుగుతున్న అమర్ నాథ్ యాత్ర ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగుతోంది. భక్తులు తగ్గిన దృష్ట్యా ఆగస్టు 23 నుంచి వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ యాత్ర ఆగస్టు 31న ముగియాల్సి ఉంది. అమర్ నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదుల కుట్రను భద్రతాదళాల ఛేదించాయి. జమ్మూలోని హైవేపై ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు.
Translate this News: