అనుమతులు, రిజిస్ట్రేషన్లు లేకుండా నడుపుతున్న ట్రేడింగ్ రికమెండేషన్ సంస్థల మీద చర్యలు తీసుకోవడం ప్రారంభించింది సెబీ. ఇందులో భాగంగా మొట్టమొదటగా మూడు కంపెనీల మీద వేటు వేసింది. ఫైనాన్షియల్ ఇన్ ఫ్లూయెర్స్ గా ఉన్న మూడు సంస్థలను వెంటనే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు వీరు ఇన్వెస్టర్ల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన మొత్తం 17.2 కోట్ల రూపాయలను తిరిగి వారికే ఇచ్చేయాలని ఆర్డర్ వేసింది. ఇందులో బాప్ ఆఫ్ చార్ట్ పేరుతో ట్రేడింగ్ రికమెండేషన్స్ చేస్తున్న మహమ్మద్ నసీరుద్దీన్ అన్సారీ కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు అయిన టెలీ గ్రామ్, ఎక్స్, యూట్యూబ్ లలో ట్రేడింగ్ సజెషన్స్ ఇస్తుంది. అన్సారీతో పాటూ గోల్డెన్ సిండికేట్ వెంచర్స్ నడుపుతున్న రాహుల్ రావు పడమటి, వారి అనుబంధ సంస్థలను కూడా రద్దు చేసింది.
పూర్తిగా చదవండి..Sebi banned finfluencer:బాప్ ఆఫ్ ఛార్ట్ కు షాక్,17.2 కోట్లు వెనక్కి తిరిగివ్వాలన్న సెబీ..కారణం ఇదే
ఫిన్ ఫ్లూయెన్సర్స్ పేరుతో రిజిస్ట్రేషన్ లేకుండా ట్రేడింగ్ రికమెండేషన్ చేస్తున్న మూడు సంస్థల మీద సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) వేటు వేసింది. సెల్ఫ్ క్లెయిమ్ ఇన్వెస్టిమెంట్ చేస్తున్న మహమ్మద్ నసీరుద్దీన్ అన్సారీ తో పాటూ మరో రెండు సంస్థలను రద్దు చేసింది. అంతేకాక వారు 17.2 కోట్లను మదుపర్లకు తిరిగి ఇవ్వాలని ఆజ్ఞలు జారీ చేసింది.
Translate this News: