ఉద్దృతంగా ప్రవహిస్తున్న మూసీ..నిండుకుండలా జంటజలాశయాలు!
జోరుగా కురుస్తున్న వర్షాలతో జంటజలాశయాలు నిండుకుండలా మారాయి. ఎడతెరిపి లేకుండా దంచుతున్న వానలతో ఉస్మాన్ సాగర్,హిమాయత్ సాగర్ కు వరద ఉద్దృతి పెరుగుతోంది. ఉస్మాన్ సాగర్ ఒకటి, రెండు గేట్లు ఎత్తితే మాత్రం మూసీ నదికి మరింత ఉద్ధృతి పెరగనుంది.మరో వైపు హుస్సేన్ సాగర్ నీటిమట్టం పెరుగుతూ పోతుంది. దీంతో దిగువన ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు.