హిట్ సినిమా వచ్చింది.. ఫ్లాప్ మూవీ రాబోతోంది

శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈమధ్య కాలంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా ఆ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అలాగే నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి కూడా ఓటీటీలోకి రానుంది.

author-image
By G Ramu
New Update
హిట్ సినిమా వచ్చింది.. ఫ్లాప్ మూవీ రాబోతోంది

థియేటర్లతో సమానంగా ఓటీటీలో కూడా హంగామా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ఓటీటీలో తళుక్కుమంటున్నాయి. ఓవైపు థియేటర్లలో బ్రో, బేబి సినిమాల హంగామా నడుస్తుంటే.. మరో వైపు ఓటీటీలో సామజవరగమన సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది.

శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈమధ్య కాలంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఏకంగా థియేటర్లలో 3 వారాల పాటు సక్సెస్ ఫుల్ గా నడిచింది. ఇంకా కొన్ని థియేటర్లలో నడుస్తోంది. ఈ సినిమాను ఆహాలో స్ట్రీమింగ్ కు పెట్టారు. స్ట్రీమింగ్ కు పెట్టిన గంటల వ్యవధిలోనే ఆహాకు రికార్డ్ స్థాయిలో వ్యూస్, సబ్ స్క్రైబర్లు పెరిగారు.

ఓవైపు సామజవరగమన హవా ఇలా నడుస్తుంటే, మరోవైపు ఓ ఫ్లాప్ సినిమా కూడా ఓటీటీలోకి రాబోతోంది. దాని పేరు రంగబలి. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమా సామజవరగమనతో పాటు థియేటర్లలోకి వచ్చింది. కానీ నిలబడలేకపోయింది.

ఈనెల 4న స్ట్రీమింగ్ కు రాబోతున్న ఈ సినిమాపై కూడా ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఎందుకంటే, ఫ్లాప్ టాక్ రావడంతో థియేటర్లకు వెళ్లడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాంటి వాళ్లంతా ఓటీటీలో ఈ సినిమాను చూడ్డానికి ఎదురుచూస్తున్నారు.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tourist Family: ఓటీటీలోకి రాజమౌళి ఫేవరేట్ సినిమా .. స్ట్రీమింగ్ డేట్ ఇదే

శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్ 2 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. రాజమౌళి సైతం మూవీపై ప్రశంసలు కురిపించారు.

New Update

Tourist Family: శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్ 2 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. రాజమౌళి సైతం మూవీపై ప్రశంసలు కురిపించారు. డెబ్యూ డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఇందులో యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్, ఎం.ఎస్. భాస్కర్, రమేష్ తిలక్, బక్స్, ఎలాంగో కుమారవేల్, శ్రీజా రవి కీలక పాత్రలు పోషించారు. 

మూవీ స్టోరీ 

శ్రీలంకలో ఆర్థిక పతనం,  COVID సంక్షోభం తర్వాత తమిళనాడుకు అక్రమంగా వలస వెళ్ళిన ధర్మదాస్ (శశికుమార్), అతని భార్య (సిమ్రాన్), వారి ఇద్దరు కుమారుల నేపథ్యంలో సాగే  కుటుంబం కథ ఇది. వారు కొత్త జీవితంలో స్థిరపడటానికి ప్రయత్నించే క్రమంలో ఆ కుటుంబం ఎదుర్కున్న సవాళ్లు ఈ చిత్రంలో చూపించారు. 

latest-news | cinema-news | telugu-cinema-news

Also Read: This Week Ott: స్టార్ హీరోల సినిమాలతో సందడే సందడి.. ఈ వారం ఓటీటీ సినిమాల ఫుల్ లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment