Road Accident: రోడ్డు దాటుతుండగా కారు ఢీ.. గాల్లో ఎగిరిపడ్డ బాధితుడు.. చివరికి

మేడ్చల్‌ జిల్లా అన్నోజిగూడలో రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని కారు ఢీకొంది. దీంతో అతడు ఒక్కసారిగా అంతెత్తున ఎగిరిపడ్డాడు. తీవ్రగాయాలపాలైన గిరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు ఇవాళ తెల్లవారుజామున మృతి చెందాడు.

Road Accident: రోడ్డు దాటుతుండగా కారు ఢీ.. గాల్లో ఎగిరిపడ్డ బాధితుడు.. చివరికి
New Update

మేడ్చల్‌ జిల్లా అన్నోజిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోన్‌ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని కారు ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా అంతెత్తున ఎగిరిపడ్డాడు. పోచారం ఐటీ కారిడార్‌ పీఎస్‌ పరిధిలో ఘటన జరిగింది. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన గిరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గిరి ఇవాళ తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడు అన్నోజిగూడ ప్రాంతానికి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు.

Also read: ఏపీ,తెలంగాణకు భారీ వర్ష సూచన

#telugu-news #medchal #road-accident #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe