Ram Charan: సంక్రాంతి వేడుకల కోసం బెంగళూరుకు వెళ్తున్న చరణ్‌-ఉపాసన!

రామ్‌ చరణ్‌ ,ఉపాసన దంపతులు సంక్రాంతి వేడుకలను ఈసారి బెంగళూరులో జరుపుకునేందుకు పయనమయ్యారు. వారు ఎయిర్‌పోర్టులో క్లీంకారతో కలిసి ఉన్న చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ గా మారాయి.

New Update
Ram Charan: సంక్రాంతి వేడుకల కోసం బెంగళూరుకు వెళ్తున్న చరణ్‌-ఉపాసన!

Ram Charan: తెలుగు హీరోలంతా కూడా ఏదైనా పండుగ వస్తే చాలు తమ ఆత్మీయులంతా కలిసి ఎంతో స్పెషల్‌ గా జరుపుకుంటారు. పండుగలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే వారిలో మెగా ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఎవరూ సాటి రారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ(Mega Family) నుంచి రెండు తరాల హీరోలు ఉన్నారు. అటు చిరంజీవి, నాగబాబు, పవన్‌ కల్యాణ్‌.

ఈసారి బెంగళూరులో..

చిరు తనయుడు చరణ్‌, నాగబాబు తనయుడు వరుణ్‌, పవన్‌ తనయుడు అకీరా, మేనల్లుళ్లు సాయి ధరమ్‌ తేజ్‌, వైష్టవ్‌ తేజ్‌, అటు అల్లు అరవింద్ కుమారులు బన్నీ, శిరీష్‌ , వెంకట్ ఇంతమంది కలిపి ఒక పెద్ద సమూహంలా ఉంటారు. ఈసారి సంక్రాంతి వేడుకలను మెగా కుటుంబం బెంగళూరులో జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది.

అకీరా నందన్‌, కుమార్తె ఆద్య..

మెగా ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకు పయనం అయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు చరణ్‌ భార్య ఉపాసన వారి కూతురు క్లీంకారాతో కలిసి బెంగళూరుకి బయల్దేరారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. ఎయిర్‌పోర్టులో వీరితో పాటు పవన్‌ తనయుడు అకీరా నందన్‌, కుమార్తె ఆద్య కూడా ఉన్నారు.

వీరందరినీ చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి కూడా చరణ్‌ తమ ప్రిన్సెస్‌ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ చేంజర్‌ సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్ లోనే జరుగుతుంది.

ఈ సినిమాలో చరణ్‌ ద్విపాత్రభినయం చేస్తున్నట్లు సమచారం. ఇందులో కియారా అద్వానీ కథనాయికగా నటిసత్ఉన్నారు. ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Also read: సీసీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Advertisment
తాజా కథనాలు