Ashok Gehlot: నెల రోజుల్లో రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కరెక్ట్ గా ఇప్పుడు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొత్సరా (Govind Singh Dotasra) సహా మరి కొందరు నేతల ఇళ్ళల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ (Ashok Gehlot) కుమారుడికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో భాగంగా రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొత్సరా ఇంట్లో సోదాలు నిర్వహించింది. Foreign Exchange Management Act నిబంధనల్ని ఉల్లంఘించినందుకు అశోక్ గహ్లోట్ కొడుకు వైభవ్కి (Vaibhav Gehlot) సమన్లు ఇచ్చింది. నవంబర్ 25న రాజస్థాన్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు కేసులూ రాజకీయాల్ని వేడెక్కించాయి. వైభవ్ ప్రస్తుతం AICC సభ్యుడిగానే కాకుండా రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈతనిని అక్టోబర్ 27న జైపూర్లో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. తాము అధికారంలోకి రామని బీజేపీకి అర్థమైందని, అందుకే ఈడీ దాడులు చేయిస్తోందని మండి పడుతోంది కాంగ్రెస్.
పూర్తిగా చదవండి..Rajasthan Politics:ఈడీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో అందరికీ తెలుసు-అశోక్ గహ్లోట్
రాజస్థాన్ లో ఉన్నట్టుండి కాంగ్రెస్ నేతల ఇళ్ళల్లో దాడులు ఎందుకు జరుగుతున్నాయో దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. రైతులు, మహిళలు అభివృద్ధి చెందడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని...అందుకే ఇప్పటి నుంచే కాంగ్రెస్ కు అడ్డుకట్ట వేస్తోందని ఆయన ఆరోపించారు.
Translate this News: