SSMB 29 : సెప్టెంబర్ లో సెట్స్ పైకి.. మహేష్ కోసం భారీ సెట్, షూటింగ్ అంతా అందులోనే!

రాజమౌళి - మహేష్ సినిమాకి సంబంధించి ఆసక్తికర అప్డేట్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. సెప్టెంబరులో ఈ సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లనున్నారట. షూటింగ్ కోసం పలు రకాల సెట్స్‌ను డిజైన్‌ చేయిస్తున్నారట. ఎక్కువ శాతం షూటింగ్‌ ఈ సెట్స్ లోనే జరుగుతుందని సమాచారం.

New Update
SSMB 29 : సెప్టెంబర్ లో సెట్స్ పైకి.. మహేష్ కోసం భారీ సెట్, షూటింగ్ అంతా అందులోనే!

Rajamouli - Mahesh Babu 'SSMB29' Movie Latest Update : 'RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత దర్శక దిగ్గజం ఎస్. ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తదుపరి సినిమా(SSMB 29) చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి దృష్టి ఈ మూవీ పైనే ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. మహేష్ బాబు కూడా కఠోరంగా కసరత్తు చేస్తూ తన బాడీ మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ మూడేళ్లు కాల్షీట్స్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా(SSMB 29) ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి తరుణంలో సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర అప్డేట్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. దాని ప్రకారం.. సెప్టెంబరులో ఈ సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రానికి చెందిన సెట్‌ వర్క్‌ను ఆరంభించారని తెలిసింది. జస్ట్‌ ఒక్క సెట్‌ కాదు... పలు రకాల సెట్స్‌ను డిజైన్‌ చేయిస్తున్నారట రాజమౌళి. వీటిలో ఆఫీస్‌ సెట్‌ కూడా ఉందని, ఎక్కువ శాతం షూటింగ్‌ ఈ సెట్‌లో జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం తయారు చేయిస్తున్న సెట్స్‌లో ఏదో ఒక సెట్‌లో తొలి షెడ్యూల్‌ని ఆరంభిస్తారట.

Also Read : ‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ డేట్ రివీల్ చేసిన నిర్మాత.. ఎప్పుడంటే?

ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన నటీనటుల ఎంపికపై రాజమౌళి దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే సినిమాలో విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై సీనియర్ నిర్మాత కే.ఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా 2026 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు