Naga Vamsi : 'దేవర' సెకండ్ సింగిల్ పై ట్రోల్స్ .. స్పందించిన నిర్మాత, దేనితో కంపేర్ చేస్తే మనకేంటి అంటూ..!

'దేవర' లేటెస్ట్ సాంగ్ పై వస్తున్న ట్రోల్స్ పై నిర్మాత నాగవంశీ ఎక్స్ వేదికగా స్పందించారు.' గత 24 గంటల నుచి ‘చుట్టమల్లే’ సాంగ్ లూప్‌లో ఉంది.తారక్ అన్నని చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఎవరు దేనితో కంపేర్ చేస్తే మనకేంటి బాయ్స్” అంటూ పేర్కొన్నారు.

New Update
Naga Vamsi : 'దేవర' సెకండ్ సింగిల్ పై ట్రోల్స్ .. స్పందించిన నిర్మాత, దేనితో కంపేర్ చేస్తే మనకేంటి అంటూ..!

Devara Second Single Trolls : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సెకండ్ సాంగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న సాయంత్రం దేవర సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. 'చుట్టమల్లే' అంటూ సాగే ఈ సాంగ్ ఆడియన్స్ నుంచి ,మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇది కాపీ సాంగ్ అని, లిరిక్స్ ఏమాత్రం అర్ధం కాలేదని, సాంగ్ లో తారక్, జాన్వీ మధ్య కెమిస్ట్రీ బాగున్నా.. డ్యాన్స్ ఆశించిన స్థాయిలో లేదనే కామెంట్స్ వినిపించాయి.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సెకండ్ సాంగ్‌పై విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాటని శ్రీలంక హిట్ సాంగ్ 'మనికే మనహేతే' అనే దానితో పోలుస్తున్నారు. రెండింటి ట్యూన్స్ చాలా దగ్గరగా ఉన్నాయని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ పై వస్తున్న ట్రోల్స్ పై నిర్మాత నాగవంశీ ఎక్స్ వేదికగా స్పందించారు.

Also Read : సినిమా ఇండస్ట్రీ ఒకరి సొత్తు కాదు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

" గత 24 గంటల నుచి 'చుట్టమల్లే' సాంగ్ లూప్‌లో ఉంది. హౌ ఈజ్ ద జోష్ బాయ్స్? తారక్ అన్నని చూస్తుంటే ముచ్చటేస్తోంది. జాన్వీని చూస్తుంటే ముద్దొచ్చేస్తోంది. ఇంకా ఎవరు ఎలా అనుకోని, దేనితో కంపేర్ చేస్తే మనకేంటి కదా బాయ్స్" అంటూ పేర్కొన్నారు . దీంతో నాగవంశీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. కొరటాల శివడైరెక్ట్ చేసిన ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో దేవర పార్ట్ -1 ప్టెంబరు 27న థియేటర్లలోకి సందడి చేయనుంది.

Advertisment
తాజా కథనాలు