PM Modi: జగన్ త్వరగా కోలుకోవాలి..ప్రధాని మోదీ పోస్టు..!

ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్విటర్ లో పోస్టు చేశారు.తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఖండించారు.

PM Modi: రేపు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం.. ఢిల్లీలో నో ఫ్లయింగ్‌ జోన్‌
New Update

PM Modi: విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్ పై కొందరు ఆగంతకులు రాళ్లు విసరడం కలకలం రేపింది. సీఎం జగన్ కు ఓవైపు పూలు చల్లుతుండగా.. మరో వైపు కొందరు ఆగంతకులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కంటికి రాయి తగిలింది. రాయి బలంగా తగలడంతో ఆయన ఎడమ కన్ను వాచింది. సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం అయింది.

ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్విటర్ లో పోస్టు చేశారు.తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఖండించారు.

ఇది కూడా చదవండి: జగన్ పై దాడి..టేక్ కేర్ అన్నా అంటూ కేటీఆర్ పోస్ట్..!

#stalin #jagan #chandrababu #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe