Prajabahav Accident Case:పరారీలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్

ప్రజా భవన్ బ్యారికేడ్లను ఢీకొట్టింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడేనని తేల్చారు వెస్ట్ జోన్ పోలీసులు. మద్యం మత్తులో షకీల్ కొడుకు సోహెల్ బారికేడ్లను గుద్దాడని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. కారులో సోహెల్ తో పాటూ ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు.

New Update
Prajabahav Accident Case:పరారీలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్

ప్రజాభవన్ వద్ద డిసెంబర్ ఆదివారం రాత్రి అతివేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు భారీకేడ్లను ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు తెలిసింది. ఇప్పుడు ఆ కారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ దని చెబుతున్నారు పోలీసులు. వీళ్లంతా స్టూడెంట్స్ అని.. కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అని కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం సోహెల్ పరారీలో ఉండగా.. అతడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మిగతా యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Also read:కుతుబ్ మీనార్ అంత ఎత్తు పిజ్జాలు..భూమిని 22సార్లు చుట్టేసంత నూడుల్స్ తినేశారు

యాక్సిడెంట్ జరిగిన తర్వాత షకీల్‌ ఇంట్లో డ్రైవర్‌గా పని వేసే వ్యక్తి.. తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడని వెల్లడించారు. షకీల్ డ్రైవర్ పోలీసుల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేశాడని.. కానీ సీసీ ఫుటేజీ ద్వారా సోహెల్‌ కారు నడిపినట్లు గుర్తించినట్లు చెప్పారు. మద్యం మత్తులో బారికేడ్లను ఢీకొట్టారని చెబుతున్నారు. సోహెల్‌పై గతంలోనూ జూబ్లీహిల్స్‌లో ఓ యాక్సిడెంట్‌ కేసు నమోదైందన్నారు. అయితే పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ నుంచి సోహెల్ తప్పించుకున్న నేపథ్యంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కావాలనే తప్పించారా అని అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు