రాహుల్ గాంధీ బోధన్ రాకను నిరసిస్తూ వెలిసిన పోస్టర్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రాత్రికి రాత్రే నిజామాబాద్, బోధన్ లో గోడలకు పోస్టర్లు ప్రత్యక్షం అయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఈరోజు రాహుల్ గాంధీ నిజామాబాద్ లోని బోధన్ లో ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. గోడ మీద ఉన్న పోస్టర్లలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. బలిదానాల బాధ్యత కాంగ్రెస్ దే… మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ అని పోస్టర్లలో రాసి ఉంది. దీనికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందే… ముక్కు నేలకు రాయాల్సిందేనని అంటూ డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023:రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిజామాబాద్ లో పోస్టర్లు
రాత్రికి రాత్రే వెలసిన పోస్టర్లు నిజామాబాద్ లో కలకలం రేపుతున్నాయి. ఈరోజు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ నిజామాబాద్ కు వెళుతున్నారు. అయితే ఆయన రాకను నిరసిస్తూ అక్కడ పోస్టర్లు ఉదయం నుంచి దర్శనమిచ్చాయి.
Translate this News: