తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఏపీ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇటీవల పొంగులేటి అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఏపీలో భారీగా పెట్టుబడులు వెళ్తాయని ప్రచారం జరిగిందన్నారు. కానీ విజయవాడలో వరదల తర్వాత పరిస్థితి మారిందన్నారు. హైదరాబాద్ కు పెట్టుబడులు భారీగా వస్తున్నాయన్నారు. దీంతో ఇది అమరావతి బ్రాండ్ ను దెబ్బతీసే కుట్రేనంటూ ఏపీ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.ఇది కూడా చదవండి: ఆ 3.50 లక్షల మంది పెన్షన్లు రద్దు.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం! • అమరావతి నభూతో నభవిష్యత్ గా అభివృద్ది చెందబోతుందనేది సత్యం• చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నాందిపలికాయి• తెలంగాణా రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ వ్యాఖ్యలు హాస్యాస్పదం మరియు ఉద్దేశ్యపూర్వకం • జగన్ మోహన్… pic.twitter.com/lpmJaKn5hK — Dhulipalla Narendra Kumar (@DhulipallaNk) December 17, 2024 టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర అయితే.. జగన్ మోహన్ రెడ్డి మిత్రత్వం వాసనలు ఇంకా పోలేదా ...?? అంటూ తన X ఖాతాలో పొంగులేటిపై ఫైర్ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి అనుంగులు విధిగా చేసే వ్యాఖ్యలే ఇపుడు పొంగులేటి చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వ్యాఖ్యలు హాస్యాస్పదం, ఉద్దేశ్యపూర్వకమన్నారు. గతంలో వైసీపీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సర్కార్ పై బురద జల్లేందుకు ఆయన కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు టీడీపీ నేతల నుంచి వ్యక్తం అవుతున్నాయి.ఇది కూడా చదవండి: రోడ్డెక్కిన రేవంత్ రెడ్డి.. మంత్రులు, కీలక నేతలతో కలిసి భారీ ర్యాలీ! ఖమ్మం మంత్రి అమరావతి మునిగిపోయే ప్రాంతం ఎవరు పెట్టుబడులు పెడతారు అక్కడ ?నల్గొండ మంత్రి తమ్ముడుఎన్టీఆర్ ఘాట్ లేపేసి కొత్త అసెంబ్లీ కట్టండి?25 మంది ఆంధ్రా మినిస్టర్స్ ఉన్నారు,ఒక్కరూ నోరు మెదపలేదు!!సరేలే మనం కూడా కాసేపు గుడ్డోడిలా నటిద్దాం...🙏😏🧐@eenadulivenews… pic.twitter.com/op7wo7BYcv — raja. (@rajapuvvadi) December 17, 2024 కోమటిరెడ్డి రేవులో తాటి చెట్టు పెరిగినట్టు పెరిగావ్ ఎలక్షన్ కో పార్టీ.ఎన్టీఆర్ ఘాట్ ఏమైనా నీ బాబుగాడిదానువ్వు అనుకోగానే తీసేసి ఏదో ఒకటి కట్టుకోవడానికి?FTL పరిధి కుదిస్తే ఇంకా హైడ్రా ఎందుకు ఈ కూల్చుడు ఎందుకు దిమాకు వుంది మాట్లాడుతున్నావా ప్రజల జీవితాలతో అడుడు ఎందుకు 😎 pic.twitter.com/MCoUSRQYi4 — Kishore K (@Kiishore_K) December 17, 2024 ఈ వ్యాఖ్యల వేడి చల్లారక ముందే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో ఎన్టీఆర్ ఘాట్ ను లేపేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడ అసెంబ్లీ కట్టాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ, ఎన్టీఆర్ అభిమారులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి టార్గెట్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒరేయ్ పిచ్చి రాజగోపాల్ రెడ్డి, @rajgopalreddy_K నువ్వు ఏదో చిట్చాట్లో అన్నావ్ అంట!నువ్వు నిజంగా అంటే, మొగుడివి అయితే, నువ్వు మాట్లాడిన పని చేసి చూపు… చూద్దాం!#pichireddy pic.twitter.com/ie629ULQTK — 9iMedia (@9imediachannel) December 17, 2024 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుజాతి ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ ఘాట్ నీ తెలుగు ప్రజలు ఒక దేవస్థానం భావిస్తున్నాం అలాంటి ఘాట్ పై కాంగ్రెస్ పార్టీ ఒక కుట్ర పన్నుతుంది ఇలాంటి నిర్ణయాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నాము @CongressTS@rajgopalreddy_K @revanth_anumula pic.twitter.com/Aw10EzPUM3 — Shyamraina Nenavath (@ShyamrainaN) December 18, 2024 గురు, శిష్యుల మధ్య చిచ్చు.. మరోవైపు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సర్కార్ మధ్య ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు చోటు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు ఇరు ప్రభుత్వాల మధ్య వివాదాలను తీసుకువచ్చే అభిప్రాయం కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గురు శిష్యులైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఈ ఇద్దరు నేతల వ్యాఖ్యలు చిచ్చు పెట్టాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారన్న ఉత్కంఠ రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది.