PM Modi Tour : ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన..10 రోజుల..12 రాష్ట్రాల టూర్.!

లోకసభ ఎన్నికల నగరా మోగడానికి ముందే ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటనకు రంగం సిద్ధమైంది. 10రోజుల్లో 12 రాష్ట్రాలను చుట్టేయనున్నారు మోదీ. వచ్చే 10రోజుల్లో తెలంగాణతోపాటు 12 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.

Modi : నేడు ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం..ఆ పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు!
New Update

PM Modi 10 Day Tour Across India: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూకుడు పెంచాడు. లోకసభ ఎన్నికల (Lok Sabha Elections 2024) షెడ్యూల్ విడుదల కాకముందే దేశంలో సుడిగాలి పర్యటన చేసేందుకు సిద్ధమయ్యారు. 10 రోజుల్లో 12 రాష్ట్రాలను చుట్టేయనున్నారు. ఇందులో తెలంగాణ (Telangana), తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జమ్మూ & కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీతోపటు కేంద్రపాలిత ప్రాంతాల్లో మోదీ పలు కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మార్చి 4న, తెలంగాణలోని ఆదిలాబాద్‌లో (Adilabad) బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆదిలాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు.

10రోజులు...12 రాష్ట్రాలు:
ఆ తర్వాత, ప్రధానిమోదీ (PM Modi) తమిళనాడుకు పయనమవుతారు. కల్పక్కంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్‌లో ఉన్న భారతీయ నాభికియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (భవినీ)ని సందర్శిస్తారు. చెన్నైలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సమావేశం అనంతరం ఆయన హైదరాబాద్‌కు వెళతారు. మార్చి 5 న, ప్రధాని మోదీ తెలంగాణలోని సంగారెడ్డిలో పర్యటిస్తారు. అక్కడ బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. అక్కడి నుంచి ఒడిశాకు వెళ్లి, చండీఖోలే, జాజ్‌పూర్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత చండీఖోలేలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తారు. మార్చి 6న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు వెళ్లనున్న ప్రధాన మంత్రి బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత బరాసత్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.అక్కడి నుంచి బీహార్‌లోని బెట్టియాలో పర్యటిస్తారు.

అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు:
మార్చి 7న శ్రీనగర్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లనున్నారు. సాయంత్రం న్యూఢిల్లీలో జరిగే మీడియా కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. మార్చి 8, సాయంత్రం షెడ్యూల్ చేయబడిన అస్సాంకు వెళ్లడానికి ముందు ఢిల్లీలో జరిగిన మొట్టమొదటి జాతీయ సృష్టికర్తల అవార్డులో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. మార్చి 9న, వెస్ట్ కమెంగ్‌లో సెలా టన్నెల్‌ను ప్రారంభించేందుకు ప్రధాని అరుణాచల్ ప్రదేశ్‌కు వెళ్లనున్నారు. అనంతరం ఇటానగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అరుణాచల్ ప్రదేశ్ నుండి, ప్రధాని అస్సాంకు వెళతారు, అక్కడ అస్సాంలోని జోర్హాట్‌లో లచిత్ బర్ఫుకాన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత జోర్హాట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు.

డిఆర్‌డిఓ కార్యక్రమంలో ప్రధాని:
ఆ తర్వాత, పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం,శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌ను సందర్శిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. మార్చి 10న ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో వివిధ ప్రాజెక్టులను అంకితం చేసేందుకు వెళతారు. మార్చి 11న ఢిల్లీలోని పుసాలో నమో డ్రోన్ దీదీ, లఖపతి దీదీకి సంబంధించిన ఈవెంట్‌లు ఉంటాయి. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్‌ను ప్రారంభించే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. సాయంత్రం డిఆర్‌డిఓ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.

మార్చి 13తో ముగియనున్న సుడిగాలి పర్యటన:
మార్చి 12న గుజరాత్‌లోని సబర్మతిలో పర్యటించి...ఆ తర్వాత జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్‌లో పర్యటిస్తూ రాజస్థాన్‌కు వెళ్లనున్నారు. మార్చి 13న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గుజరాత్, అస్సాంలో మూడు సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌లకు ప్రధాని శంకుస్థాపన చేయడంతో షెడ్యూల్ ముగుస్తుంది. ఆ తర్వాత సమాజంలోని వెనుకబడిన వర్గాల కోసం ఔట్ రీచ్ ప్రోగ్రామ్ ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఫ్యామిలీ స్టార్ పాటకు స్టెప్పులేసిన పూజ, విజయ్.. వైరలవుతున్న వీడియో

#prime-minister-modi #telangana #tamil-nadu #maharashtra #narendra-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి