Modi : ఎన్నికల వేళ దేశ ప్రజలకు మోదీ లేఖ.. ఏం రాశారంటే!

లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ లేఖను రాశారు. ఆ లేఖలో మోదీ బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో సాధించిన విజయాలు గురించి, అమలు చేసిన నిర్ణయాల గురించి ప్రజలు అందుకుంటున్న పథకాల గురించి ప్రస్తావించారు.

New Update
PM Modi : ఇప్పటి వరకు చూపించింది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది..!

Narendra Modi : లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) దేశ ప్రజలకు ఓ లేఖను రాశారు. ఆ లేఖలో మోదీ బీజేపీ(BJP) ప్రభుత్వం గత పది సంవత్సరాలలో సాధించిన విజయాలు గురించి, అమలు చేసిన నిర్ణయాల గురించి ప్రజలు అందుకుంటున్న పథకాల గురించి ప్రస్తావించారు. దేశ ప్రజలతో కలిసి మరోసారి పని చేస్తామనే విశ్వాసాన్ని ఆయన ప్రకటించారు.

రాబోయే ఎన్నికల్లో మరోసారి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. లేఖ(Letter) ను మోదీ నా ప్రియమైన కుటుంబ సభ్యులారా అంటూ ప్రారంభించారు. మన భాగస్వామ్యం దశాబ్దాకాలం పూర్తి చేసుకంది. 140 కోట్ల మంది భారతీయుల నమ్మకం, మద్దతు నాకు ఎల్లప్పుడూ ఉన్నాయి. గత 10 సంవత్సరాలలో మా ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయం మీ నమ్మకం. పేదలు , రైతులు, యువత, మహిళల జీవన నాణ్యతను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది.

పీఎం ఆవాస్ యోజన(PM Awas Yojana) ద్వారా అందరికీ పక్కా గృహాలు, అందరికీ విద్యుత్‌, నీరు, ఎల్పీజీతో పాటు ఉచిత వైద్యం, రైతులకు ఆర్థిక సహాయం, మాతృవందన యోజన తో మహిళలకు సాయం. దేశం అన్ని మార్గాల్లో ముందుకు దూసుకుపోతుంది. భారతదేశం(India), అభివృద్ధి మరియు వారసత్వంతో ముందుకు సాగుతుండగా, గత దశాబ్దంలో అపూర్వమైన మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని చూసింది, మన సుసంపన్నమైన సాంస్కృతిక మరియు జాతీయ వారసత్వ పునరుజ్జీవనాన్ని చూసే గౌరవం కూడా మాకు ఉంది. దేశం తన సుసంపన్నమైన సంస్కృతి మరియు సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నందుకు దేశస్థుడు గర్విస్తున్నాడు.

మీ విశ్వాసం మరియు మద్దతు కారణంగానే జీఎస్టీ అమలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్‌పై కొత్త చట్టం, పార్లమెంట్‌లో మహిళల కోసం నారీ శక్తి బంధన్ చట్టం, కొత్త పార్లమెంటు(Parliament) భవన నిర్మాణం, ఉగ్రవాదం మరియు నక్సలిజంపై తీవ్ర దాడి మొదలైనవి జరిగాయి. మేము అనేక చారిత్రాత్మక మరియు పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కాలేదు.మనమంతా కలిసి మన దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్తామని నేను విశ్వసిస్తున్నాను. మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలతో మీ మోడీ అంటూ లేఖలో పేర్కొన్నారు.

Also Read : ఈ రెండు విటమిన్ల లోపం వల్ల పిల్లలు పోషకాహార లోపం బారిన పడతారు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు