PM Modi Tweet About Farmers : మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ దేశరాజధాని ఢిల్లీ(Delhi) లో రైతులు చేస్తున్న ఆందోళన బీజేపీ(BJP) కి తలనొప్పిగా మారింది. తాజాగా రైతులు చేస్తున్న నిరసన(Farmers Strike) నేపథ్యంలో ప్రధాని మోడీ(PM Modi) ట్విట్టర్(X) వేదికగా కీలక ట్వీట్ చేశారు. రైతుల సంక్షేమం కోసమే తమ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వారి సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రైతుల లేవనెత్తిన ప్రతి డిమాండ్ ను తీర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. చెరుకు పంటకు గిట్టుబాటు ధర పెంచడం చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. గిట్టు బాటు ధర పెంచడం వల్ల కోట్లాది మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
పూర్తిగా చదవండి..PM Modi : ఢిల్లీలో రైతుల నిరసన.. ప్రధాని మోడీ కీలక ట్వీట్
ఢిల్లీలో రైతులు నిరసన చేస్తున్న క్రమంలో ప్రధాని మోడీ కీలక ట్వీట్ చేశారు. రైతుల లేవనెత్తిన ప్రతి డిమాండ్ను తీర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. చెరుకు పంటకు గిట్టుబాటు ధర పెంచడం చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు.
Translate this News: