PM MODI : దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొత్త ఏడాది శుభాకాంక్షలు

మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరానికి అడుగుపెడుతున్న వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలియజేశారు. 2023లో భారత్ ఎన్నో విజయాలను సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. భారత్‌ స్ఫూర్తిని 2024 లోనూ ఇలాగే కొనసాగించాలని మోదీ అన్నారు.

New Update
PM MODI : దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొత్త ఏడాది శుభాకాంక్షలు

PM Modi New Year Wishes : దేశ ప్రజలకు ప్రధాని మోదీ(PM Modi) కొత్త ఏడాది శుభాకాంక్షలు(New Year Wishes) తెలిపారు. ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించిందని అన్నారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఆమోదం పొందిందని పేర్కొన్నారు. జీ20 విజయవంతం, భారత్‌ ఐదో ఆర్థిక వ్యవస్థగా మారడంపై ప్రజలు లేఖలు రాసి సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్‌లోని ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని అన్నారు. దేశ ప్రజలు వికసిత్‌, ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తిని 2024 లోనూ ఇలాగే కొనసాగించాలని మోదీ అన్నారు.

ALSO READ: తస్మాత్ జాగ్రత్త.. దొరికితే రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష

Advertisment
తాజా కథనాలు