PM Modi On J&K Terror Attack: ఇటీవల జమ్మూకాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉగ్రవాదుల దాడి జరిగిన సంగతి తెలిసిందే. భక్తులతో వెళ్తున్న ఓ బస్సుపై కాల్పులు జరపడంతో అది అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వీటిని ఎదుర్కొనేందుకు చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో వెంటనే భద్రతా బలగాలను మోహరింపజేయాలని జాతీయ భద్రతా సలహాదారు, ఇతర ఉన్నతాధికారులను ఆదేశించారు.
పూర్తిగా చదవండి..Terror Attack: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
జమ్మూకాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో 9 మంది భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దాడిపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో వెంటనే భద్రతా బలగాలను మోహరింపజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
Translate this News: