Telangana: తెలంగాణకు రానున్న ఫార్మా గ్లాస్‌ ట్యూబ్‌ల తయారీ కేంద్రం..

తెలంగాణకు ఫార్మా గ్లాస్ ట్యూబ్‌ల తయారీ కేంద్రం రానుంది. కార్న్‌ మీటింగ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబులు చర్చలు జరిపారు. ఆ సంస్థతో అధికారికంగా అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

New Update
Telangana: తెలంగాణకు రానున్న ఫార్మా గ్లాస్‌ ట్యూబ్‌ల తయారీ కేంద్రం..

ప్రస్తుతం సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన వివిధ కంపెనీల సంస్థలతో కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు కంపెనీలు తెలంగాణలో ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణకు ఫర్మా గ్లాస్ ట్యూబ్‌ల తయారీ కేంద్రం రానుంది. కార్న్‌ మీటింగ్ కంపెనీతో సీఎం రేవంత్ బృందం ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబులు చర్చలు జరిపారు.

Also Read: ఎడారిలో అవస్థలు పడుతున్నా.. గల్ఫ్ వాసి ఆవేదన..

అనంతరం ఆ సంస్థతో అధికారికంగా అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 2025 నుంచి ఫార్మా గ్లాస్ ట్యూబ్‌ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. 2025 నుంచి ఫార్మా గ్లాస్‌ ట్యూబ్‌ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. మరోవైపు వివింట్ ఫార్మా సంస్థ ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ బృందం సమావేశమైంది. రూ.400 కోట్లతో విస్తరించేందుకు ఆ కంపెనీ ముందుకొచ్చింది. జీనోమ్ వ్యాలీలో ఇంజెక్షన్ల తయారీ కోసం కంపెనీని ఏర్పాటు చేస్తామని వివింట్ ఫార్మా వెల్లడించింది.

Advertisment
తాజా కథనాలు