తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం-రాహుల్ గాంధీ

రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తామన్నారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. ఈరోజు రేవంత్ ని కలిశాక ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

New Update
తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం-రాహుల్ గాంధీ

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించడానికి రేవంత్ ఈరోజు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకలను కలిశారు. వారిని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు.

రాహుల్ గాంధీ రేవంత్ ను అభినందించారు. పుష్పగుచ్చం ఇచ్చి మరీ కంగ్రాచ్యులేట్ చేశారు. తరువాత ఇద్దరూ ఉన్న పిక్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఏర్పడే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు