9000 Dengue Cases In Karnataka : కర్ణాటకలో డెంగ్యూ (Dengue) వ్యాధి కలవరపెడుతోంది. ఆ రాష్ట్రంలో దీని కేసుల సంఖ్య పది వేలకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 9 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారినపడి ఇప్పటిదాకా ఏడుగురు మృతి చెందారు. జులై 13 వరకు మొత్తం 66,298 మందికి డెంగ్యూ పరీక్షలు చేయగా.. అందులో 9,082 మందికి పాజిటివ్గా తేలింది. గత 24 గంటల్లో 2,557 మందిని పరీక్షించగా.. 424 మందికి డెంగ్యూ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. జ్వరం వల్ల 353 మంది ఆసుపత్రిలో చేరగా.. వాళ్లలో 119 మంది గత 24 గంటల్లో ఆసుపత్రితో అడ్మిట్ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Dengue : భయపెడుతున్న డెంగ్యూ.. ఏడుగురు మృతి
కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి కలవరపెడుతోంది. అక్కడ కేసుల సంఖ్య పది వేలకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 9 వేలకు పైగా కేసులు నమోదుకాగా.. ఈ వ్యాధి బారినపడి ఇప్పటిదాకా ఏడుగురు మృతి చెందారు.
Translate this News: