రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్గా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నిక కావడంపై రగడ ఆగడం లేదు. సంజయ్ సింగ్ ఎన్నికను రెజర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సంజయ్ సింగ్ చీఫ్గా ఎన్నిక కావడమంటే బ్రిజ్ భూషణ్ ఎన్నికైనట్టేనని రెజర్లు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికకు నిరసనగా ఇప్పటికే కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రముఖ రెజర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్కు గుడ్బై చెబుతున్నట్టు ప్రకటించారు. మీడియా సమావేశంలో ఏడ్చేశారు సాక్షి. అటు వినేశ్ సైతం కన్నీరు ఆపుకోలేకపోయింది. ఇదే సమయంలో స్టార్ రెజర్ల బజరంగ పూనియా తన పద్మశ్రీని వెనక్కి ఇస్తున్నట్టు ట్విట్టర్లో నేరుగా మోదీకి ట్యాగ్ చేశారు. పద్మశ్రీ అవార్డును మోదీకి రిటర్న్ ఇచ్చేందుకు ప్రధాని ఇంటికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన పద్మశ్రీ అవార్డును ఫుట్పాత్పైనే పెట్టి వెళ్లిపోయాడు పూనియా. రెజర్లు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే అదే సమయంలో బ్రిజ్ భూషణ్ నోటికి పని చెప్పాడు.
పూర్తిగా చదవండి..Wrestlers Row: ‘ఉరి వేసుకోవాలా?’ రెజర్లపై మరోసారి నోరుపారేసుకున్న బ్రిజ్ భూషణ్!
కాంగ్రెస్ ఒడిలో కూర్చొని పలువురు రెజర్లు నిరసన చేస్తున్నారంటూ ఆరోపించారు బీజేపీ ఎంపీ,మాజీ WFI చీఫ్ బ్రిజ్భూషణ్. రెజర్లతో పోరాడటానికి తాను ఉరి వేసుకోవాలా? అని ప్రశ్నించాడు. WFI చీఫ్గా బ్రిజ్ సన్నిహితుడు ఎన్నికను రెజర్లు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
Translate this News: