Andhra Pradesh: ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీ నామినేషన్ ముహూర్తం ఖరారే!

ఏపీలో ఎమ్మెల్సీ నగారా మోగింది. ఈసారి డాక్టర్ కొమ్మాలపాటి, పిఠాపురం వర్మ, కొణిదల నాగబాబుల ఎమ్మెల్సీ నామినేషన్ లాంఛనమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
MLC Elections in Andhra Pradesh

MLC Elections in Andhra Pradesh

ఏపీలో ఎమ్మెల్సీ నగారా మోగిన సందర్భంగా కాపు నేత ఉద్యోగుల సంఘ నాయకుడు పరుచూరి అశోక్ బాబు ఎమ్మెల్సీ ముగియనుంది. ఆ స్థానంలో టీడీపీ నుండి అదే సామాజిక వర్గానికి చెందిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణను లేదా జనసేన నుంచి నాగేంద్ర బాబు పేర్లు దాదాపు ఖరారయినట్లు ప్రచారం జరుగుతోంది .ఒక వేళ ఇద్దరికీ స్థానాన్ని కల్పించేటట్లయితే పదవీకాలం ముగిసిన బీటీ నాయుడు స్థానాన్ని ఇవ్వనున్నట్లు సమాచారం. 

అలాగే పదవి కాలం ముగిసిన బీసీ నేత యనమల రామకృష్ణుడు సామాజిక వర్గం నుండి ఇప్పటికే శాసన సభలో, క్యాబినెట్ చోటు దక్కింది. దీంతో ఆ స్థానాన్ని మరో బీసీ సామాజికవర్గ నాయకుడికి కట్టబెట్టే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన వారికి కాకుండా కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది. 

మరో టీడీపీ నాయకుడు బీసీ సామాజికవర్గానికి చెందిన దువ్వారపు రామారావు పదవి కాలం ముగియటంతో ఆ సామాజికవర్గానికి ఇప్పటికే శాసన సభలో చోటు దక్కింది. చంద్రబాబు నాయుడు.. ఆ స్థానంలో పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. డాక్టర్ కొమ్మాలపాటి ఎటువంటి వివాదం లేకుండా తన నియోజవర్గంతో పాటు పల్నాడు జిల్లా 7 స్థానాలు గెలుపుకు జిల్లా పార్టీ పగ్గాలు పట్టి కృషి చేసిన సంగతి విదితమే. 

గత మండలిలో క్షత్రియ సామాజికవర్గం నుండి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ప్రతినిధిగా ఉండే వారు. ప్రస్తుత మండలిలో కూడా ఆ సామాజికవర్గానికి దక్కనుందని తెలుస్తోంది. చంద్రబాబు ఎన్నికల హామీలో ప్రకటించిన రెండు ఎమ్మెల్సీలలో రెండవది పిఠాపురం టీడీపీ నేత ఎస్ వి ఎస్ వర్మ కు ఖారారు చేసినట్లు సమాచారం. మొత్తానికి చంద్రబాబు హామీ ఇచ్చిన డాక్టర్ కొమ్మాలపాటి, పిఠాపురం వర్మ, కొణిదల నాగబాబుల ఎమ్మెల్సీ నామినేషన్ లాంఛనమే. 

కలిదిండి వి.డి.వర్మ, సీనియర్ జర్నలిస్ట్

Cell: 8106658676

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు