Kalvakuntla Kanna Rao Land Grabbing Case : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిర్యాదుతో కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుపై కిడ్నాప్, బెదిరింపు కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. తనను కిడ్నాప్ చేసి హింసించారని ఐటీ ఉద్యోగి పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో కన్నారావుతో పాటూ మరో నలుగురిపై క్రిమినల్ కేసులు కేసును నమోదు చేశారు. బిందుమాధురి, శ్యామ్ప్రసాద్ మరికొందరితో కలిసి కన్నారావు స్కెచ్ వేశారని సాఫ్ట్వేర్ విజయ్వర్థన్రావు చెబుతున్నారు. స్థల వివాదం గురించి మాట్లాడుకుందామని పిలిచి తనను ఇంట్లో బంధించి..బంగారం, నగదు ఎత్తుకెళ్లారని ఆయన ఆరోపిస్తున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ కట్టేసి కత్తులతో బెదిరించారని ఫిర్యాదు చేశారు. తనను శారీరకంగా, మానసికంగా హింసించారని.. అప్పటి ఏసీపీ భుజంగరావు తమకు తెలుసంటూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. తన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయించి మోసగించారని విజయ్వర్థన్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.
పూర్తిగా చదవండి..Telangana: కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు
ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు ఇప్పుడు మరో వివిదంలో చిక్కుకున్నారు. తనను కిడ్నాప్ చేసి హింసించారని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒకరు ఆతని మీద కంప్టైంట్ చేశారు.
Translate this News: