ఆ ఊరిలో ఒకే కుటుంబం ఉంటోంది.. ఎందుకో తెలుసా ?

మహారాష్ట్రలోని మేల్‌ఘాట్ అటవీ ప్రాంతంలో పిలీ అనే గ్రామంలో ఒకే కుటుంబం నివసిస్తోంది. 20 ఏళ్ల క్రితం ఓ ప్రాజెక్టు చేపట్టడంతో ఆ గ్రామంలో దాదాపు 500 కుటుంబాలు వెళ్లిపోగా ఒకే కుటంబం మాత్రం అక్కడే నివసిస్తోంది. తమకు అక్కడే ఆస్తులు ఉండటంతో వెళ్లలేదని ఆ కుటుంబం చెబుతోంది.

New Update
ఆ ఊరిలో ఒకే కుటుంబం ఉంటోంది.. ఎందుకో తెలుసా ?

సాధారణంగా ఒక ఊరు అంటే అందులో వంద సంఖ్యలో కుటుంబాలు ఉంటాయి. కానీ మహారాష్ట్రలోని మేల్‌ఘాట్ అనే అటవీ ప్రాంతంలోని పిలీ అనే ఊరిలో ఒకే కుటుంబం నివసిస్తోంది. ప్రస్తుతం ఈ గ్రామాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే ఇలా ఆ ఊరిలో ఒకే కుటుంబం నివసించడానికి కూడా ఓ పెద్ద కారణమే ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. వాస్తవానికి ఆ గ్రామంలో గతంలో 500 వరకు కుటుంబాలు నివసించేవి. అయితే 20 ఏళ్ల క్రితం మేల్‌ఘాట్ టైగర్ రిజర్వ్‌ ప్రాజెక్టు కట్టడం ప్రారంభించారు. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా దాదాపు 37 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి వస్తుందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే 17 గ్రామాలను వేరే ప్రాంతాలకు తరలించారు. మరో ఆరు గ్రామాల తరలింపు ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలోనే పిలీ అనే ఊరిలో ఉంటున్న 500 కుటుంబాలు 2021లోనే ఖాళీ చేసి వెళ్లిపోయాయి. అయితే అధికారులు కచ్చితంగా ఖాళీ చేయాల్సిందేనని ఆ గ్రామంలో ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. కేవలం ప్రభుత్వ నోటీసులు మాత్రమే పంపించింది.

Also Read: హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత..

అయితే అందరూ వెళ్లిపోయినప్పటికీ భోగిలాల్‌ భాయిట్కర్ కుటుంబం మాత్రం ఆ పిలీ గ్రామాన్ని వీడలేదు. అతనితో పాటు భార్య, పిల్లలు కలిపి మొత్తం ఆరుగురు ఆ గ్రామంలోనే ఉంటున్నారు. అయితే ఆ కుటుంబం ఎందుకు వెళ్లలేకపోయిందో భాయిట్కర్ వివరించారు. తనకు వాళ్ల గ్రామంలో 25 ఎకరాల్లో వ్యవసాయ భూమి, పెద్ద ఇల్లు, 8 ఆవులు, 15 నుంచి 20 కోళ్లు ఉన్నాయని చెప్పారు. ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్నానని తెలిపారు. తన పెద్ద కొడుకు పెళ్లి కూడా జరిగిందని.. అతను కూడా భార్యతో కలిసి ఇక్కడే ఉంటూ పిల్లల్ని చదివించుకుంటున్నారని చెప్పారు. ఆ పిల్లల్ని తానే బైక్‌పై తీసుకెళ్లి సమీప గ్రామంలోని స్కూ్ల్‌లో దించేస్తానని తెలిపారు. అయితే భాయిట్కర్ తన వ్యవసాయ భూమికి, ఇల్లుకి సమానమైన ధరను చెల్లిస్తే.. ఆ ఊరిని విడిచి వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఇక్కడి నుంచి వెళ్లిపోతే ప్రభుత్వం కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇస్తుందని.. ఆ డబ్బుతో ఏం చేసుకోవాలంటూ భాయిట్కర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పోలీసుల అదుపులో మహదేవ్ యాప్ ఓనర్

Advertisment
తాజా కథనాలు