Rahul Gandhi: రాహుల్ గాంధీకి బీజేపీ బిగ్ షాక్..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ జనవరి 14న ఇంఫాల్‌లో ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ ప్రారంభించాల్సి ఉంది.. ఈ క్రమంలో యాత్రకు మణిపూర్‌లో అనుమతిని నిరాకరించింది అక్కడి బీజేపీ సర్కార్. మణిపూర్‌ అల్లర్లు, శాంతి భద్రతల దృష్ట్యా భారత న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వలేమని తెలిపింది.

New Update
Rahul: నేటి  నుంచి 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' షురూ

Bharat Jodo Nyay Yatra: రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) భారత న్యాయ యాత్రకు బిగ్‌ షాక్‌ తగిలింది. మణిపూర్‌లోని ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లాలో ప్రారంభం కావాల్సిన భారత న్యాయ యాత్రకు బ్రేక్‌ పడింది. ప్రారంభోత్సవ ర్యాలీకి పర్మిషన్‌ ఇవ్వడం కుదరని మణిపూర్‌లోని (Manipur) బీజేపీ సర్కార్‌ (BJP Government) తేల్చి చెప్పేసింది. మణిపూర్‌ అల్లర్లు, శాంతి భద్రతల దృష్ట్యా భారత న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది.

ఈ నెల 14 నుంచి మార్చి 20 వరకూ భారత్‌ జోడో న్యాయ యాత్రకు శ్రీకారం చుట్టారు రాహుల్‌ గాంధీ. ఇంఫాల్‌ ఈస్ట్‌లోని చారిత్రక హప్తా కాంజీబంగ్‌ వేదికగా ప్రారంభోత్సవ వేడుక నిర్వహించేందుకు మణిపూర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రారంభ వేదికకు అనుమతి కోసం వారం రోజుల క్రితం చీఫ్‌ సెక్రటరీకి లేఖ రాశారు MPCC అధ్యక్షుడు కేశం మేఘచంద్ర. స్వయంగా ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ను కలిసి అనుమతి కోరారు. అయితే.. ఇంఫాల్‌ ప్యాలెస్‌ గ్రౌండ్‌లో వేదికకు అనుమతి ఇవ్వడం లేదని బీరెన్‌ సింగ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ALSO READ: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఫైనల్

యాత్ర కొనసాగుతుంది.. కేసీ వేణుగోపాల్

మరోవైపు అనుమతి నిరాకరణపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ స్పందించారు. షెడ్యూల్‌ ప్రకారమే రాహుల్‌ గాంధీ భారత న్యాయ యాత్ర ప్రారంభమవుతుందన్నారు కేసీ వేణుగోపాల్‌. గత ఏడాది రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ పాదయాత్ర చేశారు. దీనికి కొనసాగింపుగా జనవరి 14 నుంచి భారత్‌ జోడో న్యాయ యాత్ర తలపెట్టారు రాహుల్‌ గాంధీ.

మణిపూర్‌ నుంచి ముంబై వరకూ ఈ యాత్ర కొనసాగించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే జెండా ఊపి.. ఈ యాత్రను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండియా కూటమి సభ్యులు, పలువురు ఎంపీలు పాల్గొంటారని మణిపూర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మేఘచంద్ర వెల్లడించారు. అటు ఈశాన్య భారతం నుంచి పశ్చిమ భారతం వరకూ రాహుల్‌ తలపెట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 100 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ మార్చి 20న ముంబైలో ముగియనుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు