Bihar Floor Test: బిహార్ అసెంబ్లీలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. నేడు అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) -బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం గెలిచింది. మొత్తం 129 ఎమ్మెల్యేల మద్దతుతో నితిశ్ కుమార్ మరోసారి బలపరీక్షలో సమర్థవంతగా నెగ్గారు. దీంతో విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అయితే బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. ఇందులో ఆర్జేడీ-కాంగ్రెస్ (RJD – Congress) నేతృత్వంలో మహాకూటమికి 110 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక బీజేపీ-జేడీయూ నేతృత్వంలో NDA కూటమికి 125 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది.
పూర్తిగా చదవండి..Bihar Floor Test: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్.. వౌకౌట్ చేసిన విపక్షాలు
నేడు బిహార్ అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో సీఎం నితీష్ కుమార్-బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం గెలిచింది. మొత్తం 129 ఎమ్మెల్యేల మద్దతుతో నితిశ్ కుమార్ మరోసారి బలపరీక్షలో సమర్థవంతగా నెగ్గారు. మరోవైపు స్పీకర్గా ఆర్జేడీ నేత అవధ్ చౌదరీపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది.
Translate this News: