Karnataka: వీడేం డాక్టర్..శిశువు జననాంగాలు కత్తిరించేశాడు ఏకంగా..

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఓ మహిళకు సిజేరియన్ చేసిన డాక్టర్ శిశువు జననాంగాలను కత్తిరించాడు. ఈ కారణంగా పసిబిడ్డ పుట్టిన కొద్ది గంటల్లోనే మరణించింది. దీంతో పేరెంట్స్‌, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

Karnataka: వీడేం డాక్టర్..శిశువు జననాంగాలు కత్తిరించేశాడు ఏకంగా..
New Update

నిజంగా డాక్టర్ చదివాడో...లేకపోతే ఫేక్ సర్టిఫికేట్‌తో హాస్టల్ పెట్టాడో తెలియదు కానీ ఓ డాక్టర్ అభంశుభం తెలియని పసికందు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. జూన్‌ 17న నెలలు నిండిన అమృత, ప్రసవం కోసం చిగటేరి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యింది. సాధారణ డెలివరీ సాధ్యం కాదన్న డాక్టర్లు ఆమెకు సిజేరియన్‌ చేయాలని చెప్పారు. దీంతో ఆమెకు సిజేరియన్ కోసం అన్ని ఏర్పాట్లను చేశారు. అప్పుడే డాక్టర్‌ పొరపాటున నవజాత శిశువు ప్రైవేట్‌ భాగాన్ని కత్తిరించాడు. ఈ నేపథ్యంలో పసిబాబు ఆరోగ్యం విషమించడంతో ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే బేబీ చికిత్స పొందుతూ చనిపోయాడు.

దీంతో అమృత కుటుంబ సభ్యులు ఆ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. డాక్టర్ నిజాముద్దీన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ బిడ్డ చనిపోయినట్లు అమృత, ఆమె భర్త అర్జున్‌ ఆరోపించారు. ఆ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Also Read:National: హిమాచల్‌ను ముంచెత్తుతున్న వర్షాలు..బీహార్‌లో పిడుగులు

#doctor #c-section #davngere #baby #karnataka
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe