ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్దంలో ఇప్పటికే వేలాది మంది మృతి చెందారు. మరోవైపు గాజాలో తిండి లేక అక్కడి స్థానిక ప్రజలు అల్లాడిపోతున్నారు. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపాలని ఐక్యరాజ్య సమితిలో ఈఏఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించి దీన్ని తిరస్కరించింది. దీంతో ఇజ్రాయెల్ దళాలు గాజాపై తమ దాడులను మరింత తీవ్రతరం చేశాయి. దీంతో ఇజ్రాయెల్కు అమెరికా(America) మద్దితిస్తున్నంత వరకు ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుదని.. దీనివల్ల పశ్చిమాసియాలో భవిష్యత్తులో ఊహించని, నియంత్రించలేని పరిణామాలు చోటుచేసుకుంటాయని.. ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హుస్సేన్ అమిర్ అబ్దుల్లాహియన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఇరాన్కు ఇప్పుడు రష్యా సహకారం అందడంతో దీనిపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఫోన్ చేసి మాట్లాడారు.
పూర్తిగా చదవండి..Israel-Hamas War: ‘ఇది ప్రమాదకరం’.. పుతిన్కు నెతన్యాహు ఫోన్ !
ఐరాసలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా రష్యా ప్రతినిధులు మద్దతు ఇవ్వడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసి ఇది ప్రమాదకరమైన సహకారమని అంసతృప్తి వ్యక్తం చేశారు.ఇరువురు మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికే రష్యా అన్ని విధాలుగా సహకరిస్తుందని పుతిన్ చెప్పారు.
Translate this News: