International Smuggling Rocket : అరేబియా సముద్రంలో మరోసారి అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్(International Smuggling Rocket) ను ఛేదించింది భారత నౌకాదళం. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) తో కలిసి నౌకదళం తాజాగా సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా గుజరాత్ పోర్బందర్ తీరంలో అక్రమంగా తరలిస్తున్న నౌక నుంచి 3,300 కేజీల డ్రగ్స్(Drugs) ను స్వాధీనం చేసుకుంది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ను పట్టుకోవడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Drugs : 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం.. ఐదుగురు పాకిస్థానియులు అరెస్ట్
గుజరాత్ పోర్బందర్ తీరంలో అక్రమంగా తరలిస్తున్న నౌక నుంచి 3,300 కేజీల డ్రగ్స్ను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. మంగళవారం అనుమానస్పదంగా ఓ చిన్నపాటి నౌక భారత జలాల్లోకి ప్రవేశించగా.. అధికారులు దాన్ని ముట్టడించి సీజ్ చేశారు. ఆ నౌకలో ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు.
Translate this News: