చేపలు దొంగిలించిందని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు..సీఎం ఫైర్ !

చేపలు దొంగిలించిందనే ఆరోపణలతో ఒక మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ చర్యను ఖండిస్తూ దర్యాప్తునకు ఆదేశించారు.

New Update
fish karnataka

చేపలు దొంగిలించిందనే ఆరోపణలతో ఒక మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ చర్యను ఖండిస్తూ దర్యాప్తునకు ఆదేశించారు. ఉడిపి జిల్లాలోని మాల్పే ఓడరేవు ప్రాంతంలో చేపలు దొంగిలించారనే ఆరోపణలతో మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసినట్లు సమాచారం.

సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం

ఈ సంఘటనపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ దృశ్యాలను చూసి తాను షాక్ అయ్యానని, ఆ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించడాన్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. కారణం ఏదైనా, ఒక మహిళ చేతులు, కాళ్లను ఈ విధంగా కట్టి, ఆమెపై దాడి చేయడం అమానవీయమే కాదు, తీవ్రమైన నేరం కూడా. ఇటువంటి అనాగరిక ప్రవర్తన కర్ణాటక వంటి నాగరిక ప్రదేశానికి తగదని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.  సమగ్ర దర్యాప్తు జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించానని ముఖ్యమంత్రి అన్నారు.

అయితే  కర్ణాటకలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ, అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర దాడి చేసింది. బెళగావిలో జరిగిన దాడి, హంపిలో ఇద్దరు మహిళలపై జరిగిన సామూహిక అత్యాచారం వంటి మహిళలపై ఇటీవల జరిగిన ఇతర నేరాలను ఆ పార్టీ హైలైట్ చేస్తూ, ప్రజా భద్రతను నిర్ధారించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించింది. 

Also read :  ఎంతకు తెగించావ్రా ప్రొఫెసర్‌ .. విద్యార్థులను రేప్ చేసి వెబ్‌సైట్లలో వీడియోలు అప్‌లోడ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు