/rtv/media/media_files/2025/06/13/Y950ySBPxKXaz9rv2St1.jpg)
అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విషాదకరమైన ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిపోయింది. ఈ భయంకరమైన విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులోని ఓ బాధితురాలు తన భర్త బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేసింది. లండన్ లో ఉన్న తన భర్తను కలిసేందుకు బయలుదేరింది. అయితే గాల్లోకి విమానం ఎగిరిన కాసేపటికే అనంతలోకాలకు వెళ్లింది.
లండన్లో క్లౌడ్ ఆర్కిటెక్ట్గా
ఇండోర్లోని హోరా కుటుంబానికి చెందిన హర్ప్రీత్ కౌర్ భర్త రాబీ హోరా లండన్లో క్లౌడ్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాడు. జూన్ 16న అతని బర్త్ డే ఉండటంతో మూడు రోజులు ముందుగానే లండన్ కు బయలుదేరింది. కానీ ఊహించని ఈ ప్రమాదం ఆమె కుటుంబానికి విషాదాన్ని మిగిలించింది. నిజానికి హర్ప్రీత్ కౌర్ తన తల్లిని కలవడానికి కొన్ని రోజుల క్రితమే లండన్ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. వాస్తవానికి ఆమె జూన్ 19న తిరిగి లండన్ వెళ్లాలనుకుంది.
అయితే జూన్ 16న తన భర్త రాబీ బర్త్ డే ఉండటంతో జూన్ 12న లండన్ కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే విమానం కూలిపోవడంతో హర్ప్రీత్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.