Omar Abdullah : అదనపు మిగులు జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లించడాన్ని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యతిరేకించారు. ముఖ్యంగా పంజాబ్కు నీటిని విడుదల చేయడానికి ఆయన ఆసక్తి చూపించడం లేదు. గతంలో తమ రాష్ట్రానికి అవసరమైన నీటిని ఆ రాష్ట్రం అందించలేదన్న ఆయన ఏళ్లతరబడి తమను ఏడిపించిందని ఆరోపించారు. అలాంటపుడు ఆ రాష్ట్రానికి తామేందుకు నీళ్లు ఇవ్వాలని ప్రశ్నించారు. కాగా జమ్మూలో 113 కి.మీ మేర ప్రతిపాదించిన ఓ కాలువ ద్వారా నీటిని తరలించే అంశంపై మాట్లాడిన ఒమర్ ఈ సందర్భంగా పంజాబ్ కు నీటిని విడుదల చేసే అంశంపై తన వైఖరిని స్పష్టం చేశారు.
Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్లు మింగించి!
‘ఈ నీటి ప్రతిపాదనను నేను అంగీకరించను. ముందు మా అవసరాలకు నీటిని వినియోగించుకోనివ్వండి. జమ్మూలో కరవు పరిస్థితులు ఉన్నాయి. పంజాబ్కు ఎందుకు పంపించాలి..?సింధూ జలాల ఒప్పందం కింద వాళ్లకు ఇప్పటికే నీళ్లు ఉన్నాయి. అవసరమైనప్పుడు వాళ్లేమైనా మాకు నీళ్లు ఇచ్చారా? ఏళ్లపాటు మమ్మల్ని ఏడిపించారు. మరి మేమెందుకు ఇవ్వాలి?’’ అని ఒమర్ అబ్దుల్లా ఖరాఖండిగా తేల్చి చెప్పారు.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
కాగా జమ్మూలోని రావి నది నుంచి అదనపు జలాలు పాకిస్థాన్కు వెళుతున్నాయి. ఈ నీటిని వారికి వెళ్లకుండా అడ్డుకోవాలని భారత్ భావిస్తోంది. దీనికోసం పఠాన్ కోట్ వద్ద బ్యారేజీ నిర్మించాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. అయితే ఈ విషయంలో పంజాబ్, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాల మధ్య అనేక సంవత్సరాల నుంచి వివాదం కొనసాగింది. అయితే 1979లో దీనిపై ఒక ఒప్పందం చేసుకున్నప్పటికీ.. కేంద్రం జోక్యం చేసుకోవడంతో 2018లో వివాదానికి తెరపడింది. అయినప్పటికీ ఆ విషయాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా పరోక్షంగా ప్రస్తావించారు.. కాగా పంజాబ్కు నీళ్లు ఇవ్వడంపై తన వైఖరిని వెల్లడించారు.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
Omar Abdullah: వాళ్లకెందుకు నీళ్లు ఇవ్వాలి?: సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
అదనపు జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లించడాన్ని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యతిరేకించారు. ముఖ్యంగా పంజాబ్కు నీటిని విడుదల చేయడానికి ఆయన ఆసక్తి చూపించడం లేదు. గతంలో తమ రాష్ట్రానికి అవసరమైన నీటిని ఆ రాష్ట్రం అందించకుండా తమను ఏడిపించిందని ఆరోపించారు.
Jammu and Kashmir cm Omar Abdullah
Omar Abdullah : అదనపు మిగులు జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లించడాన్ని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యతిరేకించారు. ముఖ్యంగా పంజాబ్కు నీటిని విడుదల చేయడానికి ఆయన ఆసక్తి చూపించడం లేదు. గతంలో తమ రాష్ట్రానికి అవసరమైన నీటిని ఆ రాష్ట్రం అందించలేదన్న ఆయన ఏళ్లతరబడి తమను ఏడిపించిందని ఆరోపించారు. అలాంటపుడు ఆ రాష్ట్రానికి తామేందుకు నీళ్లు ఇవ్వాలని ప్రశ్నించారు. కాగా జమ్మూలో 113 కి.మీ మేర ప్రతిపాదించిన ఓ కాలువ ద్వారా నీటిని తరలించే అంశంపై మాట్లాడిన ఒమర్ ఈ సందర్భంగా పంజాబ్ కు నీటిని విడుదల చేసే అంశంపై తన వైఖరిని స్పష్టం చేశారు.
Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్లు మింగించి!
‘ఈ నీటి ప్రతిపాదనను నేను అంగీకరించను. ముందు మా అవసరాలకు నీటిని వినియోగించుకోనివ్వండి. జమ్మూలో కరవు పరిస్థితులు ఉన్నాయి. పంజాబ్కు ఎందుకు పంపించాలి..?సింధూ జలాల ఒప్పందం కింద వాళ్లకు ఇప్పటికే నీళ్లు ఉన్నాయి. అవసరమైనప్పుడు వాళ్లేమైనా మాకు నీళ్లు ఇచ్చారా? ఏళ్లపాటు మమ్మల్ని ఏడిపించారు. మరి మేమెందుకు ఇవ్వాలి?’’ అని ఒమర్ అబ్దుల్లా ఖరాఖండిగా తేల్చి చెప్పారు.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
కాగా జమ్మూలోని రావి నది నుంచి అదనపు జలాలు పాకిస్థాన్కు వెళుతున్నాయి. ఈ నీటిని వారికి వెళ్లకుండా అడ్డుకోవాలని భారత్ భావిస్తోంది. దీనికోసం పఠాన్ కోట్ వద్ద బ్యారేజీ నిర్మించాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. అయితే ఈ విషయంలో పంజాబ్, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాల మధ్య అనేక సంవత్సరాల నుంచి వివాదం కొనసాగింది. అయితే 1979లో దీనిపై ఒక ఒప్పందం చేసుకున్నప్పటికీ.. కేంద్రం జోక్యం చేసుకోవడంతో 2018లో వివాదానికి తెరపడింది. అయినప్పటికీ ఆ విషయాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా పరోక్షంగా ప్రస్తావించారు.. కాగా పంజాబ్కు నీళ్లు ఇవ్వడంపై తన వైఖరిని వెల్లడించారు.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం