Chirag Paswan: నిన్ను చంపేస్తాం..కేంద్రమంత్రికి హత్య బెదిరింపులు

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు సోషల్ మీడియా ద్వారా హత్య బెదిరింపులు వచ్చాయి. ఆయన పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రాజేష్ భట్ ఈ మేరకు పాట్నాలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు.

New Update
patna-police

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు సోషల్ మీడియా ద్వారా హత్య బెదిరింపులు వచ్చాయి. ఆయన పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రాజేష్ భట్ ఈ మేరకు పాట్నాలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. 'టైగర్ మెరాజ్ ఇడిసి' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ బెదిరింపు వచ్చినట్లు రాజేష్ భట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక యూట్యూబర్ -జర్నలిస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ బెదిరింపు పోస్ట్ వచ్చింది.  

ప్రజాదరణ కారణంగానే

చిరాగ్ పాశ్వాన్ పెరుగుతున్న ప్రజాదరణ కారణంగానే ఈ బెదిరింపు వచ్చిందని రాజేష్ భట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అలస్యం చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ఈ ఘటనపై పాట్నా సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా,   దర్యాప్తు జరుగుతోందని సైబర్ డీసీపీ నితీష్ చంద్ర ధారియా తెలిపారు. ఈ హత్య బెదిరింపులు బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రావడం సంచలనంగా మారింది.  

చిరాగ్ పాశ్వాన్ ఇటీవల బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. గతంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం జెడ్-కేటగిరీ భద్రతను కూడా కల్పించింది. కాగా ఎల్జేపీ (రామ్ విలాస్) జనతాదళ్ (యునైటెడ్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లతో కలిసి అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో భాగం. రాబోయే బీహార్ ఎన్నికలకు ఎల్జేపీ ఎన్డీఏతో పొత్తు కొనసాగించే అవకాశం ఉంది, ఈ ఏడాది చివర్లో అక్టోబర్ లేదా నవంబర్‌లో బీహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 

Also Read :  Vivo X100 Offers: వివో రచ్చ రచ్చ.. రూ.16వేల భారీ డిస్కౌంట్ - 50MP+50MP+64MP కెమెరా హైలైట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు