జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పహెల్గామ్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దొంగదెబ్బ తీశారు. ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్లో వచ్చి మరీ కాల్పులు జరిపారు. పేరు ఏంటీ, మతం ఏంటని అడుగుతూ ముస్లింలు అయితే పక్కన పెట్టి మిగితా వారిని కాల్చి చంపేశారు. ఓ మహిళ భర్తను చంపేసి ఆమెను మాత్రం వదిలేశారు. నన్ను కూడా చంపేయమని ప్రాధేయపడగా.. ఇక్కడ జరిగిన ఘటనను దేశానికి చెప్పేందుకు నువ్వు ఉండాలంటూ ఆమెను వదిలేశారు. కాగా ఈ ఘటనలో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా ఇందులో ఐదుగురు పర్యాటకుల మృతి చెందగా.. మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
Just imagine—a couple on their honeymoon facing such terror.#Pahalgam #JammuKashmir #PahalgamTerrorAttack pic.twitter.com/IZqzaML6w9
— Sujal Singh 🪸 (@sujalsingh_x) April 22, 2025
దాడికి పాల్పడింది మేమే : టీఆర్ఎఫ్
ఉగ్రవాదులను వేటాడేందుకు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో తమిళనాడు,ఒడిశా,గుజరాత్, మహారాష్ట్ర,కర్నాటకకు చెందిన టూరిస్ట్లకు గాయాలయ్యాయి. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించింది. అమర్నాథ్ యాత్రకు కొద్దిసేపటి ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది. అమర్నాథ్ యాత్ర భద్రత గురించి ప్రశ్నలు తలెత్తాయి.
आतंकियों ने पूछा नाम, हिंदू होने पर मार दी गोली
— Kashmiri Hindu (@BattaKashmiri) April 22, 2025
Dear Hindus
Now that Amarnath Yatra is going to start, remember that you will need security cover from Islamist Terrorists in a Hindu majority country.
But still you are intolerant and communal.#Pahalgam pic.twitter.com/zIgjFe6hgn
మరోవైపు జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడిని ప్రధాని మోదీ ఖండించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడిన మోదీ.. తగిన చర్యలు తీసుకోవాలని షాకు సూచించారు. ఘటనాస్థలానికి వెంటనే వెళ్లాలని అమిత్ షాకి మోదీ ఆదేశాలు జారీ చేశారు. మోదీ కూడా జమ్ముకశ్మీర్లోని ఘటనాస్థలానికి వెళ్లనున్నారు. జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడిని ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. దాడికి పాల్పడినవారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదని ట్వీట్ చేశారు.
#BREAKING : Union Home Minister Amit Shah left for #Pahalgam in #Kashmir , will take stock of the situation there and inform the PM MODI#JammuKashmir #PahalgamTerrorAttack #pahalgamattack #AmitShah #NarendraModi pic.twitter.com/y6KDFhWJ1u
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) April 22, 2025
jammu-and-kashmir | tourists | pm-narendra-modi