/rtv/media/media_files/2025/02/08/6tga5ywGpbriLLWEwR4d.jpg)
aap aravind
హర్యానా, మహారాష్ట్ర, ఇప్పుడు ఢిల్లీ వరుసగా విజయాలు కొట్టుకొస్తోంది బీజేపీ. దీని ప్రభంజనంలో పడి పెద్ద పెద్ద నేతలు కొట్టుకుపోతున్నారు. ఈరోజు ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా బీజేపీ దెబ్బకు ఢమాల్ అన్నారు. అయితే ఆప్ ఓడిపోవడానికి కారణం ఒక్క బీజేపీనే అని చెప్పలేము అని అంటున్నారు. గత పదేళ్ళల్లో ఆప్ పాటించిన విధానాలు కూడా కారణమని చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా రోడ్డు, మురుగనీరు, చెత్త..ఈ మూడూ ఆప్ ప్రాభవాన్ని దెబ్బ తీశాయని విశ్లేషిస్తున్నారు.
ఆప్ ను ఓడించిన మూడు ముఖ్య కారణాలు..
ఢిల్లీలో కేజ్రీవాల్ తో సహా ముఖ్య నేతలందరూ ఓడిపోయారు. దీనికి చాలానే కారణాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి మాత్రం మూడని చెబుతున్నారు.
మొదటిది రోడ్లు..
ఢిల్లీలో ఆప్ ఓటమికి దెబ్బతిన్న రోడ్లు ప్రధాన కారణమని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఢిల్లీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని..వాటిని ఆప్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు. బారాపుల్లా, రాణి ఝాన్సీ ఫ్లైఓవర్తో సహా అనేక ఫ్లైఓవర్లపై గుంతలు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది కాకుండా, భజన్పురా నుండి యమునా విహార్ వరకు మెట్రో నిర్మిస్తున్న డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కింద రోడ్డుపై భారీ గుంతలు ఉన్నాయి. వీటిపై ప్రజలు నడవడం కూడా కష్టంగా ఉందనేది వాస్తవం. దానికి తోడు గుంతల్లో మురుగనీరు నిండిపోయి ఉండిపోతోంది. వీటిని బాగు చేయకపోవడం, కత్త రోడ్డు వేయకపోవడం ఆప్ ఓటమికి కారణమైందని విశ్లేషిస్తున్నారు.
రెండోది నీరు..
ఢిల్లీలో పరిశుభ్రమైన నీరు ఎ్పటి నుంచ ఉన్న సమస్య. దీన్ని బాగు చేస్తామని ఆప్ చాలా సార్లు చెప్పింది. కానీ ఏమీ చెయ్యలేదు. యమునా నీటి నుండి తాగునీటి వరకు ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. యమునా జలాల విషయంలో బీజేపీ.. ఆప్ను లక్ష్యంగా చాలాసార్లు చేసుకుంది కూడా. 2019 ఎన్నికల్లో యమునా నది నీటిని శుభ్రం చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ వాగ్దానం చేసింది. కేజ్రీవాల్ పెద్ద గొప్పగా తాను యమునాలో స్నానం చేస్తానని..నీటిని తాగుతూ కనిపిస్తానని చెప్పారు అధికారంలోకి వచ్చాక దాని ఊసే మర్చిపోయారు. పైగా తాజా ఎన్నికల్లో ఈ నేరాన్ని బీజేపీ మీదకు తోసేయాలని కూడా చేశారు. హర్యానాలో యమునా నీటిని విషపూరితం చేస్తున్నారంటే ఆరోపణలు కూడ చేశారు. ఇది కూడా ఆప్ ను భారీగా దెబ్బ తీసింది.
చెత్త..
ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం ప్రజలకు సమస్యగా మారింది. దీని కారణంగా, వచ్చేవారు మరియు వెళ్ళేవారు సమస్యలను ఎదుర్కుంటూనే ఉన్నారు. బీజేపీ ఈ అంశం మీద ప్రత్యేక దృష్టి సారించగా...ఆప్ గాలికి వదిలేసింది. ఘాజీపూర్లో.. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాలలో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. దీని గురించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతే స్వాతి మలివాల్ నిరసన కూడా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం వెలుపల చెత్తతో నిండిన ట్రక్కును పడేశారు. ఇది కాకుండా, మూడు పల్లపు ప్రదేశాలకు 11,300 టన్నుల చెత్త చేరుతుందని, కానీ 9,700 టన్నులు మాత్రమే పారేయడానికి అవుతోందని లెక్కలతో సహా నిరూపించి చూపించారు స్వాతి మలివాల్. అయినా కూడా దీనిపై కేజ్రీవాల్ ఏమీ యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఆ చెత్తలోనే ఆయన కొట్టుకుపోయారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మూడు విషయాలపై కేజ్రీవాల్ శ్రద్ధ పట్టి ఉంటే గెలిచి ఉండేవారని అంటున్నారు.
Also Read: Delhi Elections: ఫలించిన బీజేపీ ఎత్తుగడ..ఓడిన అరవింద్ కేజ్రీవాల్