/rtv/media/media_files/2025/04/24/iWZfadLJXG7pFy2GtIyP.jpg)
pahalgam attack
పహల్గాం దాడి గురించి, ఉగ్రవాదుల ప్లాన్ గురించి తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఉగ్రదాడికి పక్కా ప్లాన్ చేసిన టెర్రరిస్టులు నిఘా వర్గాలను కూడా తప్పుదారి పట్టించాయని తెలుస్తోంది. శ్రీనగర్ శివారులో జబర్వాన్ కొండ ప్రాంతాల్లోని హోటళ్లలో బస చేసిన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయనున్నారని పహల్గాం దాడికి ముందు నిఘా ర్గాలకు సమాచారం వచ్చింది, దీంతో ఆ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను చేశారు. దాచిగామ్, నిషాత్ ప్రాంతాల్లో పోలీసు బలగాలు విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించాయి. గంగన్ గిర్, సోన్ మార్గ్ ప్రాంతాల్లో నిఘా పెంచారు. నిఘా వర్గాలకు అందిన సమాచారం దాదాపు రెండు వారాలపాటూ భద్రతా సిబ్బంది శ్రీనగర్ చివర్లో పహారా కాశారు.
అదే రోజు మారణకాండ..
కరెక్ట్ గా ఏప్రిల్ 22న భద్రతా సిబ్బంది తాము చేస్తున్న పనులను ఆపేశారు. అదే రోజు ఉగ్రవాదులు పహల్గాంలో రక్తపాతం సృష్టించారు. కనీసం భద్రతా సిబ్బంది ఈ దాడిని ఊహించలేదు కూడా. అంతేకాదు కట్రా, శ్రీనగర్ మధ్య తొలి రైలును ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్కు వస్తున్న సందర్భంగా దాడి చేయాలని ఉగ్రవాదులు పథకం పన్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ కట్రా రైలు మార్గం పాకిస్తాన్ కు అస్సలు ఇష్టం లేదు. అయితే ప్రధాని దీని ఓపెనింగ్ కు రాలేదు. వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవడం వలన ఆ పర్యటన కాస్తా వాయిదా పడింది. అలాగే రైలు మార్గం కూడా ఓపెన్ అవలేదు.
today-latest-news-in-telugu | terrorists | Phalgam Attack
Also Read: RCB VS CSK: చెన్నై ఇంటికి..బెంగళూరు ప్లే ఆఫ్స్ కు..