/rtv/media/media_files/2025/04/27/KLRgUSYwwXj9rAcTS3FC.jpg)
Kupwara
జమ్మూ కశ్మీర్ లో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పహల్గామ్ ఘటన మరువకముందే మరో దాడికి పాల్పడ్డారు. కుప్వారా జిల్లాలో45 ఏళ్ల సోషల్ యాక్టివిస్ట్ రసూల్ మాగ్రేపై ఆయన ఇంట్లోనే కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో రసూల్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను టెర్రరిస్టులు టార్గెట్ చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాల్పుల గురించి సమాచారం అందిన తర్వాత వెంటనే భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Also Read : Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!
Also read : Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
In #Kashmir, a 45-year-old social activist Ghulam Rasool Magray was shot and injured by terrorists at his residence in Kandi Khas area of #Kupwara district late last night.
— News Vibes of India (@nviTweets) April 27, 2025
ముగ్గురు ఉగ్రవాద సహచరులు అరెస్టు
ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందడంతో భద్రతా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. గురువారం బండిపోరాలోని ఒక చెక్పాయింట్ వద్ద పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా (LeT)తో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాద సహచరులను అరెస్టు చేశారు. కాగా పహల్గామ్ ఘటనలో 25 మంది భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. 2019 పుల్వామా బాంబు దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడులలో పహల్గామ్ దాడి ఒకటిగా అభివర్ణించబడుతోంది, ఈ దాడిలో 40 మంది CRPF సిబ్బంది మరణించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద దాడులలో ఇది ఒకటి.
Also read : India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!
Also read : Bike Accident : తండ్రికి బైక్ను గిప్ట్గా ఇచ్చేందుకు వెళ్తూ అనంతలోకాలకు!