Telia Bhola fish: మత్స్యకారులకు కాసుల వర్షం.. రూ.కోటికి అమ్ముడుపోయిన చేపలు

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు కాసుల వర్షం కురిసింది. సముద్రంలో వాళ్లకు అరుదైన తెలియా భోళా అనే చేపలు దొరికాయి. మొత్తం వలలో 90 చేపలు పడ్డాయి. వీటిని వేలం వేస్తే ఓ కంపెనీ ప్రతినిధులు రూ.కోటికి దక్కించుకున్నారు.

New Update
Telia Bhola fish sold for Rs. 1 crore in Odisha

Telia Bhola fish sold for Rs. 1 crore in Odisha

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు కాసుల వర్షం కురిసింది. జలేశ్వర్‌ ప్రాంతానికి చెందిన కొందరు మత్స్యకారులు శనివారం రాత్రి చేపల వేటకు వెళ్లారు. సముద్రంలో వాళ్లకు అరుదైన తెలియా భోళా అనే చేపలు దొరికాయి. మొత్తం వలలో 90 చేపలు పడ్డాయి. వీటిని వేలం వేస్తే ఓ కంపెనీ ప్రతినిధులు రూ.కోటికి దక్కించుకున్నారు. వీటి ఒక్కో చేప బరువు ఏకంగా 30 నుంచి 35 కిలోలు ఉన్నట్లు అక్కడి స్థానికులు తెలిపారు. అయితే ఈ తెలియా భోళా చేపలను ఔషధాల తయారీలో వాడుతుంటారు. అందుకే ఇంత ధర పలికింది.   

Advertisment
తాజా కథనాలు