/rtv/media/media_files/2025/10/13/supreme-court-2025-10-13-11-53-12.jpg)
Supreme Court
ఇటీవల తమిళనాడులోని కరూర్లో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తుపై పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసినట్లు పేర్కొంది. సెప్టెంబర్ 27న కరూర్లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: మత్స్యకారులకు కాసుల వర్షం.. రూ.కోటికి అమ్ముడుపోయిన చేపలు
దీంతో ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం SIT దర్యాప్తునకు ఆదేశించింది. అయితే తమిళనాడు అధికారులు దర్యాప్తు చేయడంపై విజయ్ సహా మరికొందరు అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే దీనిపై విచారించిన జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ అంజారియా ధర్మాసనం సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.
The Supreme Court today(October 13) ordered an investigation by the Central Bureau of Investigation into the Karur stampede.
— Live Law (@LiveLawIndia) October 13, 2025
Read more: https://t.co/FKzo9wptpO#SupremeCourt#Karurstampede#CBI#Vijay#TVKpic.twitter.com/jgWpFPA9j2