/rtv/media/media_files/2025/06/10/AaLjFHwmmpNm715upx5A.jpg)
భారత ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లాను రోదసిలోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన యాక్సియమ్ 4 మిషన్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఉదయం చేపట్టాల్సిన ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగాన్ని భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మార్చినట్టు ఇస్రో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ వద్ద ప్రతికూల వాతావరణం నెలకొన్న కారణంగా లాంచింగ్ టైమ్ను మంగళవారం నుంచి బుధవారానికి మార్చినట్టు ఇస్రో పేర్కొన్నది.
India returns to space after 41 years: Indian astronaut Shubhanshu Shukla to pilot Axiom 4 mission to ISS for a 14-day long odyssey
— Defence Matrix (@Defencematrix1) June 8, 2025
🚀 Launching aboard: SpaceX Falcon 9 on June 10 from NASA’s Kennedy Space Center
🛰️ Docking at ISS: June 11, 10 PM IST https://t.co/zB5iW5APHA
రాకేశ్ శర్మ తర్వాత మరో భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసిలోకి వెళ్తుండటంతో యాక్సియమ్ 4 మిషన్కు ప్రాధాన్యం ఏర్పడింది. నాలుగు దశాబ్దాల తర్వాత రోదసిలోకి వెళ్తున్న భారతీయ వ్యోమగామిగా శుక్లా రికార్డు సృష్టించబోతున్నారు.