Flight Accident: విమాన ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. రాజస్థాన్ కు చెందిన డాక్టర్ ప్రతీక్, కోమీ వ్యాస్ తమ ముగుగరు పిల్లలతో సహా చనిపోయారు. చనిపోవడానికి ముందు వీరు తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు వైరల్ అవుతోంది.

New Update
flight

5 members of Family died

విమాన ప్రమాదంలో దాదాపు అందరూ మరణించారు. విమాన సిబ్బందితో పాటూ ఫ్లైట్ లో 250 మంది ఉన్నారు. అందరి మృతదేహాల వెలికతీత అయిపోయిందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. కుటుంబీకులు డీఎన్ఏ కోసం ఎదురు చూస్తున్నామని...అది రాగానే ఎవరు ఎవరో తెలుసుకుంటామని అన్నారు. 

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..

విమాన ప్రమాద మృతుల్లో  ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారని తెలుస్తోంది. రాజస్థాన్ బన్స్ వారా నుంచి లండన్ కు మూవ్ అవుతున్న ప్రతీక్ జోషీ,డాక్టర్ కోమీ వ్యాస్ దంపతులు వారి ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరందరూ లండన్ కు మూవ్ అవుతున్నారు. ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఫ్యామిలీ అంతా కలిసి ఆనందంగా సెల్ఫీ తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అవుతోంది.  సంతోషంగా వెళుతున్న ఆ కుటుంబంలో చిన్న పిల్లలతో సహా అందరూ చనిపోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 

డాక్టర్ కోమి వ్యాస్ మరియు డాక్టర్ ప్రతీక్ జోషి ఇద్దరూ ఉదయపూర్‌లోని పసిఫిక్ హాస్పిటల్‌లో పనిచేసేవారని కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు తెలిపారు. డాక్టర్ జోషి కొంతకాలం క్రితం లండన్‌కు వెళ్లారు. ఇప్పుడు కుటుంబాన్ని తనతో తీసుకెళ్లడానికి ఈ వారం ప్రారంభంలోనే రాజస్థాన్‌లోని బన్స్వారాకు తిరిగి వచ్చారు. భార్య కోమీ వ్యాస్ కూడా డాక్టరే. వీరిద్దరికీ ఐదు ఏళ్ళ కుమార్తె మిరాయా, ఇద్దరు కవలలు నకులు, ప్రద్యుత్ ఉన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు