Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు

మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్‌ కేసులో మరో పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీతో సహా ఐదుగురుని షిల్లాండ్‌ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు విచారణలో సోనమ్ తన భర్తను తానే లోయలోకి తోసేసినట్లు అంగీకరించింది.

New Update
Shillong Court Sends 5 Accused Including Sonam Raghuvanshi To 8-Day Police Custody

Shillong Court Sends 5 Accused Including Sonam Raghuvanshi To 8-Day Police Custody

మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్‌ కేసులో మరో పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీతో సహా ఐదుగురుని షిల్లాండ్‌ కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. నిందితులకు 8 రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. సోనమ్ భర్త, మృతుడు రాజా రఘువంశీపై శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా భావించారు. ఆ తర్వాత సోనమ్‌ కోసం గాలించగా.. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో తేలింది. 

Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !

ప్రియుడితో కలిసి ఆమె తన భర్త రాజా రఘువంశీని హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆ తర్వాత పోలీసులు ఆమెతో సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలో తన ప్రమేయం ఉన్నట్లు సోనమ్ పోలీసుల విచారణలో చెప్పింది. తన భర్త రాజాను చంపిన తర్వాత తానే లోయలోకి తోసేసినట్లు అంగీకరించింది. సిట్ ముందు భోరున ఏడుస్తూ హత్య ప్లాన్ మొత్తం వివరించింది. ఇక హత్యకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!

ఇదిలాఉండగా రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్‌లోని ఇండౌర్‌లో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తోంది. అయితే మే 11న రాజాకు సోమన్‌తో పెళ్లి జరిగింది. 20న ఈ నవదంపతులు హనీమూన్‌ కోసం మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత ఎక్కడా కనిపించకుండా పోయారు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 11 రోజుల తర్వాత రాజా మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలోని లోయలో గుర్తించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు